NTV Telugu Site icon

Tirumala: ఇవాళ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవోపేతంగా జరుగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్రదీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

Read Also: CM YS Jagan: నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 67,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో రూ.2.94 కోట్లు సమర్పించారు.