Somu Veerraju: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. వాటికి నా శరీరం అలవాటు పడింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి.. పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది అధిష్టానం.. కేంద్ర బీజేపీ వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు వీర్రాజు.. నడ్డా నుంచి ఫోన్ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి ఇంటికెళ్లిపోయిన ఆయన.. అధ్యక్ష స్థానం నుంచి తప్పించడంపై మీడియాతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు.. అయితే, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.. ఇక, సాయంత్రానికి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు సోము వీర్రాజు.. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానన్న ఆయన.. పార్టీ చెప్పిన విధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Read Also: Sandra Venkata Veeraiah: కాంగ్రెస్పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ఇక, రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు వీర్రాజు.. ఇటువంటి ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడిందన్న ఆయన.. నా మీద ఫిర్యాదులు ఎవరు చేశారో, పార్టీలో నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదని పేర్కొన్నారు. చాలా మంది పంచాయతిలో కూడా గెలవలేనని నన్ను విమర్శిస్తారు.. అలా గెలవాలనుకుంటే వేరే పార్టీలో ఉండే వాడిని అంటూ హాట్ కామెంట్లు చేశారు. 1978 నుంచి బీజేపీలో ఉన్నాను.. నా పార్టీ బీజేపీయే అని స్పష్టం చేశారు.. బీజేపీ బలోపేతం కోసం నా శాయశక్తులా పని చేశాను.. ఇప్పుడు మా అధిష్టానం నిర్ణయం వల్ల నాకు బాధ లేదు, ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.. బూత్ స్థాయిలో కమిటీలు వేసి పార్టీ కోసం పని చేశాను. నా సారథ్యంలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపిపారు.. నా సేవలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది అధిష్టానం ఇష్టం. సామాన్య కార్యకర్తగా పని చేయడానికి అయినా సిద్ధమే అన్నారు.. ఎవరి సారథ్యంలో కమిటీలు వచ్చినా.. పార్టీ కోసం అందరూ పని చేస్తారు అని వెల్లడించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..