Somireddy Chandramohan Reddy: తల్లిని, చెల్లిని మేం దూరం చేశామా..? వారికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి ఆయన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్.. కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు.. కుటుంబంలో చిచ్చు పెడతారు అంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.. తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరులో మీడియతో మాట్లాడిన ఆయన.. తన తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిలను తెలుగుదేశం పార్టీనే తనకు దూరం చేసిందని వైఎస్ జగన్ అంటున్నారు.. తల్లిని, చెల్లిని మేం దూరం చేశామా? అని ప్రశ్నించారు. తల్లి.. చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని విమర్శించినా ఆయన.. జగన్ మాటలకి సిగ్గూ.. శరం లేదని ఫైర్ అయ్యారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదు.. అందరినీ సమానంగా చూడాలని క్రిస్మస్ రోజున జగన్ సందేశం ఇవ్వడం విడ్డూరం అన్నారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదని చెబుతాడు. మా అందరిపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తాడు.. ఇది ఆయన నైజం అంటూ సీఎం వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
Also Read
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇక, సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి కాకాని చెప్పినట్లు నడుస్తోందని విమర్శించారు సోమిరెడ్డి.. జాతీయ రహదారి పక్కన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీ పేర్లతో మంత్రి కాకాణి దోచుకుంటున్నారు. వెంకటాచలంలో తహసిల్దారుగా పనిచేసిన ప్రసాద్ అనే అధికారి రికార్డులను మార్చే శారు. గ్రామ సభలు పెట్టకుండా పట్టాలు ఇచ్చారు.. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు.. సమాచార హక్కు చట్టం కింద జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నాను అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో పనిచేసిన తహసిల్దార్ కూడా సస్పెండ్ అయ్యారు. మంత్రి కాకాని కింద రెవెన్యూ శాఖ అని నలిగిపోతోంది.. భూములకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో అధికారులు ప్రదర్శించాలి అని డిమాండ్ చేశారు. పది రోజుల్లో అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరించారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
Read Also: Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!