IND W vs NZ W: సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. వన్డే చరిత్రలో రికార్డు
- మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన స్మృతి మంధాన
- వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు
- మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టిన మంధాన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 122 బంతుల్లో 100 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. 28 ఏళ్ల మంధాన వన్డే కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ. తన కెరీర్లో ఏడు వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను అధిగమించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
మిథాలీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది:
మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 88 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించింది. కాగా.. మిథాలీ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మూడో స్థానంలో ఉంది. 135 వన్డే మ్యాచ్ల్లో ఆరు సెంచరీలు సాధించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మంధాన రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు చేసింది:
మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 2-1తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఫ్లాప్గా నిలిచిన మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధాన రెండో వికెట్కు యాస్తికా భాటియా (35)తో 76 పరుగులు, హర్మన్ప్రీత్ (59 నాటౌట్)తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది.
మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది:
మంధాన తన అద్భుతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను మొదటి రెండు గేమ్ల్లో రాణించలేకపోయినప్పటికీ, ఈరోజు సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!