IND W vs NZ W: సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. వన్డే చరిత్రలో రికార్డు
- మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన స్మృతి మంధాన
- వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు
- మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టిన మంధాన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 122 బంతుల్లో 100 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. 28 ఏళ్ల మంధాన వన్డే కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ. తన కెరీర్లో ఏడు వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను అధిగమించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మిథాలీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది:
మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 88 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించింది. కాగా.. మిథాలీ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మూడో స్థానంలో ఉంది. 135 వన్డే మ్యాచ్ల్లో ఆరు సెంచరీలు సాధించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మంధాన రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు చేసింది:
మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 2-1తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఫ్లాప్గా నిలిచిన మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధాన రెండో వికెట్కు యాస్తికా భాటియా (35)తో 76 పరుగులు, హర్మన్ప్రీత్ (59 నాటౌట్)తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది.
మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది:
మంధాన తన అద్భుతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను మొదటి రెండు గేమ్ల్లో రాణించలేకపోయినప్పటికీ, ఈరోజు సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!