IND W vs NZ W: సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. వన్డే చరిత్రలో రికార్డు
- మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన స్మృతి మంధాన
- వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు
- మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టిన మంధాన.
మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 122 బంతుల్లో 100 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. 28 ఏళ్ల మంధాన వన్డే కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ. తన కెరీర్లో ఏడు వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను అధిగమించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
మిథాలీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది:
మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ మిథాలీ రాజ్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 88 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించింది. కాగా.. మిథాలీ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మూడో స్థానంలో ఉంది. 135 వన్డే మ్యాచ్ల్లో ఆరు సెంచరీలు సాధించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మంధాన రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు చేసింది:
మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 2-1తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఫ్లాప్గా నిలిచిన మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధాన రెండో వికెట్కు యాస్తికా భాటియా (35)తో 76 పరుగులు, హర్మన్ప్రీత్ (59 నాటౌట్)తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది.
మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది:
మంధాన తన అద్భుతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను మొదటి రెండు గేమ్ల్లో రాణించలేకపోయినప్పటికీ, ఈరోజు సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!