IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం!
- మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణీ
- మెరిసిన స్మృతి, రేణుక
- 211 పరుగుల తేడాతో ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్పై టీ20 సిరీస్ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 24న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91; 102 బంతుల్లో 13×4), ప్రతీక రావల్ (40; 69 బంతుల్లో 4×4)లు తొలి వికెట్కు 110 పరుగులు జోడించారు. రావల్ అనంతరం హర్లీన్ డియోల్ (44) దూకుడుగా ఆడింది. సెంచరీ చేసేలా కనిపించిన స్మృతి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీగా వెనుదిరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31) రాణించడంతో భారత్ స్కోరు 300 దాటింది. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్ (5/45) ఐదు వికెట్స్ తీసింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
భారీ ఛేదనలో విండీస్ ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే ఓపెనర్ కియానా జోసెఫ్ రనౌట్ అయింది. రేణుక సింగ్ చెలరేగడంతో 26 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షిమైన్ క్యాంప్బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24), అలియా (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో రేణుకతో పాటు ప్రియ మిశ్రా (2/22), దీప్తిశర్మ (1/19) రాణించారు. వన్డేల్లో పరుగుల పరంగా భారత్కు ఇది రెండో పెద్ద విజయం. అంతకుందు 2017లో ఐర్లాండ్పై 249 పరుగుల తేడాతో గెలిచింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!