Bihar Sampark Kranti : బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు
- సమస్తిపూర్ రైల్వే స్టేషన్ నుంచి కదిలిన రైలు
- మంటలు చెలరేగాయంటూ..జనరల్ బోగీ నుంచి ప్లాట్ఫారమ్పైకి దూకిన ప్రయాణికులు
- ఘటనా స్థలానికి చేరకున్న అధికారులు
- మంటలు ఆర్పే యంత్రం లీక్ అయినట్లు గుర్తింపు
- ఎలాంటి మంటలు చెలరేగలేదని నిర్ధారించి రైలును పంపిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో స్టేషన్లో గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్ఫారమ్పై నుంచి కదలగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపారు.
READ MORE: Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ..
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
స్టేషన్లో మోహరించిన ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బంది వెంటనే ప్రజలు దూకుతున్న రైలు బోగీ వద్దకు చేరుకున్నారు. అక్కడికక్కడే విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ ఒక్కసారిగా లీకైనట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే మెకానికల్ విభాగం కమిటీ అధికారులు స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. అంతా బాగానే ఉందని చూసి.. రైలును 10:30 గంటలకు ముజఫర్పూర్కు పంపారు.
READ MORE:YouTuber: నూతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!
ఈ ఘటనకు సంబంధించి సమస్తిపూర్ రైల్వే డీఎస్పీ రోషన్ కుమార్ గుప్తా సమాచారం ప్రకారం.. రైలు నంబర్ 12565 దర్భంగా-న్యూ ఢిల్లీ బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆదివారం 09:21 గంటలకు సమస్తిపూర్ స్టేషన్కు చేరుకుంది. సుమారు 09:45 గంటలకు.. రైలు బయలుదేరుతుండగా.. జనరల్ కోచ్ నంబర్ 205056/Cలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు ప్లాట్ఫారమ్పైకి దూకారు. మంటలు చెలరేగాయని పుకార్లు రావడంతో కోచ్ నంబర్ 205056/సీని విచారించాం. ఇది జనరల్ కోచ్. కోచ్లో ఉంచిన మంటలను ఆర్పే యంత్రంపై ఓ ప్రయాణికుడు కూర్చున్నట్లు విచారణలో తేలింది. దీంతో అగ్నిమాపక యంత్రం లీక్ అయ్యింది. సిలిండర్ లో నింపిన డ్రై కెమికల్ పౌడర్ బయటకు రావడం మొదలైంది. ఆ పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఆందోళన చెంది బయటకు దూకారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!