BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..
- కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..
- పార్టీలో చేరిన దండె విఠల్.. భానుప్రసాద్ రావు.. ఎంఎస్.ప్రభాకర్.. బొగ్గారపు దయానంద్.. ఎగ్గే మల్లేశం.. బస్వరాజు సారయ్య..
- సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు
BRS MLCs In Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని హస్తం పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ ఉన్నారు.
Read Also: Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
కాగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే జోరుగా చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఒకవైపు ఆషాఢమాసం వస్తుండటంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం ఏకంగా 12కు చేరింది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!