BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..
- కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..
- పార్టీలో చేరిన దండె విఠల్.. భానుప్రసాద్ రావు.. ఎంఎస్.ప్రభాకర్.. బొగ్గారపు దయానంద్.. ఎగ్గే మల్లేశం.. బస్వరాజు సారయ్య..
- సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLCs In Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని హస్తం పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ ఉన్నారు.
Read Also: Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
కాగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే జోరుగా చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఒకవైపు ఆషాఢమాసం వస్తుండటంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం ఏకంగా 12కు చేరింది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!