NCP: అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar’s NCP Removes 3 Leaders: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటుదారుడు అజిత్ పవార్కు మద్దతు ఇచ్చిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. బహిష్కరణకు గురైన నాయకులు ముంబై డివిజనల్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్ముఖ్, రాష్ట్ర మంత్రి శివాజీరావు గార్జే. ముగ్గురూ అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read: Sharad Pawar: సమయం వచ్చినప్పుడు అందరూ నాతో ఉంటారు.. ఎన్సీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునేందుకు అజిత్ పవార్ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. “9 మంది ఎమ్మెల్యేల ఈ చర్యలు తక్షణం అనర్హత వేటు వేయాలి. ఒకవేళ సభ్యులుగా కొనసాగడానికి అనుమతిస్తే, వారు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉంది” అని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ అనూహ్యం తిరుగుబాటు చేసిన ఎన్సీపీ అధినేత, బాబాయ్ శరద్ పవార్కు షాక్ ఇచ్చారు.
Also Read: Jharkhand: మంత్రి మరణించిన 2 నెలల తర్వాత మంత్రిగా భార్య ప్రమాణ స్వీకారం
ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ రమేష్ బైస్, అజిత్ పవార్ చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న 83 ఏళ్ల మరాఠా నాయకుడు శరద్ పవార్ ధైర్యంగా అజిత్ పవార్ తిరుగుబాటును “దోపిడీ”గా పేర్కొన్నాడు. బీజేపీతో అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. శివసేనతో కలిసి వెళ్లగలిగితే బీజేపీతో కూడా వెళ్లగలమని, నాగాలాండ్లో కూడా అదే జరిగింది అని అజిత్ పవార్ అన్నారు. కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత 1999లో తన బాబాయ్ స్థాపించిన ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదని ఆయన నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!