Shabbir Ali : జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్కు చెందిన ఎనిమిదవ నిజాం, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ శనివారం రాత్రి ఇస్తాంబుల్లో మరణించారు. కుటుంబం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. “హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ గత రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో రాత్రి 10:30 గంటలకు మరణించారని తెలియజేయడానికి మేము చాలా బాధపడ్డాము. తన స్వస్థలంలో అంత్యక్రియలు చేయాలన్న అతని కోరిక మేరకు, అతని పిల్లలు 17 జనవరి 2023 మంగళవారం నాడు దివంగత నిజాం భౌతికకాయంతో హైదరాబాద్కు వెళ్లనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్కు తరలించి, అవసరమైన అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత, అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొంది. షెడ్యూల్ మరియు ఇతర వివరాలు నిర్ణీత సమయంలో విడుదల చేయబడతాయి’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read : Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఇదిలా ఉంటే.. మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ అక్టోబరు 6, 1933న టర్కీ చివరి సుల్తాన్ (ఒట్టోమన్ సామ్రాజ్యం) సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II కుమార్తె, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజం జా మరియు యువరాణి దురు షెహ్వార్లకు జన్మించాడు. డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను కేంబ్రిడ్జ్లోని హారో మరియు పీటర్హౌస్లో చదువుకున్నాడు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హర్స్ట్లో కూడా చదువుకున్నాడు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మనవడు నిజాం మీర్ ముక్కరం జా మృతిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ.. ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహించి జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ట్విటర్లో “8వ నిజాం మీర్ ముక్కరం జా బహదూర్ మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. జనవరి 17న అధికారికంగా సెలవు ప్రకటించి, ప్రభుత్వ గౌరవంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని @TelanganaCMOని డిమాండ్ చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!