Shabbir Ali : జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్కు చెందిన ఎనిమిదవ నిజాం, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ శనివారం రాత్రి ఇస్తాంబుల్లో మరణించారు. కుటుంబం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. “హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ గత రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో రాత్రి 10:30 గంటలకు మరణించారని తెలియజేయడానికి మేము చాలా బాధపడ్డాము. తన స్వస్థలంలో అంత్యక్రియలు చేయాలన్న అతని కోరిక మేరకు, అతని పిల్లలు 17 జనవరి 2023 మంగళవారం నాడు దివంగత నిజాం భౌతికకాయంతో హైదరాబాద్కు వెళ్లనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్కు తరలించి, అవసరమైన అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత, అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొంది. షెడ్యూల్ మరియు ఇతర వివరాలు నిర్ణీత సమయంలో విడుదల చేయబడతాయి’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read : Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ అక్టోబరు 6, 1933న టర్కీ చివరి సుల్తాన్ (ఒట్టోమన్ సామ్రాజ్యం) సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II కుమార్తె, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజం జా మరియు యువరాణి దురు షెహ్వార్లకు జన్మించాడు. డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను కేంబ్రిడ్జ్లోని హారో మరియు పీటర్హౌస్లో చదువుకున్నాడు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హర్స్ట్లో కూడా చదువుకున్నాడు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మనవడు నిజాం మీర్ ముక్కరం జా మృతిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ.. ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహించి జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ట్విటర్లో “8వ నిజాం మీర్ ముక్కరం జా బహదూర్ మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. జనవరి 17న అధికారికంగా సెలవు ప్రకటించి, ప్రభుత్వ గౌరవంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని @TelanganaCMOని డిమాండ్ చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!