Sand Mafia: ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు..
- ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలి..
- రోడ్డున పడిన మూడు కుటుంబాలు..
- వారిపై ఎందుకు చర్యలకు వెనకాడుతున్నారు..?..
- నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?..
- సిల్లీ రీజన్స్తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Mafia: నెల్లూరు జిల్లా పెరమణ జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మామూలుగా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే 24 గంటల్లోపు నిందితుల్ని అరెస్టు చేస్తారు పోలీసులు.. ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తుంది. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ప్రమాదం జరిగి ఆరు రోజులు అవుతున్న ఇంతవరకూ నిందితులు ఎవరనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. A1, A2, A3 అంటూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ.. అందులో A1, A2 వివరాలను మాత్రం బయట పెట్టలేదు. కనీసం వారి పేరుని సైతం FIRలో పొందుపరచ్చలేదు.. విచారణ తరువాత డ్రైవర్ తోపాటు టిప్పర్ ఓనర్ పేరును ఛార్జ్ షీట్లో పెడతామని పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. ప్రమాదానికి కారకులైన డ్రైవర్, ట్టిప్పర్ ఓనర్ని తప్పించి.. మరో డ్రైవర్ పేరు పెట్టేందుకు పోలీస్ శాఖపై సదసు సీఐ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
Read Also: Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ముఖ్యంగా ఇసుక, గ్రావెల్ తో పాటు క్యాట్ ఫిష్, పిడిఎస్ రైస్ అక్రమార్కులు సదరు పోలీస్ స్టేషన్లోని ఉన్నతాధికారులతో కుమ్మక్కై.. వారికి చేతులు తడుపుతున్నారన్న ప్రచారం ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖలో జరుగుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కూడా డ్రైవర్ని, ఓనర్ని తప్పించేందుకు పోలీస్ శాఖలోని ఓ సీఐ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.. ఇది గమనించిన నెల్లూరు ఎస్పి అజిత.. సదరు సీఐ కి వార్నింగ్ సైతం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే…ఏడు మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసును ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ కి ఉన్నతాధికారులు అప్పగించారు. ఆరు రోజులు గడుస్తున్న ఇందులో ఇంతవరకు కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.
విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయా నేతల ఒత్తిళ్లకు తలోగ్గి.. పోలీసులు కేసును నిర్లక్ష్యం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ డ్రైవర్ కారును ఢీ కొట్టి.. అనంతరం స్టేషన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం.. అయితే టిప్పర్ డ్రైవర్ వివరాలను కూడా పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. టిప్పర్ ఏ కంపెనీ పేరు మీద ఉందో.. ఓనర్ ఎవరనే విషయాన్ని పోలీసులకు తెలిసినప్పటికీ.. అతని తప్పించేందుకు పోలీసులు నాటకాలు ఆడుతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన్ని తప్పించేందుకు పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని సొంత శాఖలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కేసును కొత్త ఎస్పీ అజిత ఎలా డీల్ చేస్తారో.. ప్రమాదానికి కారణమైన నిందితులను అరెస్టు చేస్తారో లేదో చూడాలి…
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..