Nampally Court నాంపల్లి కోర్టులో టీ. సర్కార్ కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.
Also Read : Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!
Also Read
గత సంవత్సరం రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదే రోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జున్ రామచంద్ర భారతికి రిమాండ్ ను తిరస్కరించారు. రామచంద్ర భారతికి అదే రోజు బెయిల్ మంజూరు కూడా చేశారు. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలోనే రామచంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కేసును ఇవాళ విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడం కుదరని పేర్కొంది.
Also Read : India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రతివాదుల్లో ఉన్న సీఎం కేసీఆర్కు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను పలుసార్లు కోర్టు విచారించినప్పటికీ అధికారికంగా నోటీసులు జారీ చేయలేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించడంతో దీనిపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తును సాగించవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!