Nampally Court నాంపల్లి కోర్టులో టీ. సర్కార్ కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.
Also Read : Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
గత సంవత్సరం రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదే రోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జున్ రామచంద్ర భారతికి రిమాండ్ ను తిరస్కరించారు. రామచంద్ర భారతికి అదే రోజు బెయిల్ మంజూరు కూడా చేశారు. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలోనే రామచంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కేసును ఇవాళ విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడం కుదరని పేర్కొంది.
Also Read : India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రతివాదుల్లో ఉన్న సీఎం కేసీఆర్కు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను పలుసార్లు కోర్టు విచారించినప్పటికీ అధికారికంగా నోటీసులు జారీ చేయలేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించడంతో దీనిపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తును సాగించవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!