Saroor Nagar Husband M*urder case: సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డంబెల్స్ తో మోది..
- సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- డంబెల్స్ తో మోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు. వివాహేతర సంబంధంపై భార్య చిట్టిని భర్త శేఖర్ మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యకు ప్లాన్ చేసింది.
Also Read:Russia: రష్యా గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
భర్త శేఖర్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో పిల్లలు ఇంట్లో లేని సమయంలో భార్య చిట్టి ప్రియుడికి కాల్ చేసి రప్పించింది. నిద్రలో ఉన్న శేఖర్ ను గొంతు నులిమి చంపుతుండగా ప్రతిఘటించాడు.. విషయం తెలిసిపోతుందని భావించిన భార్య చిట్టి వెంటనే భర్తలపై డంబుల్స్ తో మోదింది. దీంతో భర్త శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హత్య సమయంలో కుమార్తె ప్రభుత్వ హాస్టల్ లో ఉంటుండగా, కుమారుడిని గణేష్ మండపం వద్ద పడుకోబెట్టినట్లు తెలిపారు.. భర్త శేఖర్ చనిపోయడని నిర్దారించుకున్న తర్వాత ప్రియుడు ఘటన స్థలం నుండి వెళ్ళిపోయాడు.. ఉదయం డయల్ 100కు కాల్ చేసిన భార్య చిట్టి.. తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని పోలీసులకు తెలిపింది.
Also Read:Off The Record : టీడీపీ వర్సెస్ జనసేన పోయి.. జనసేన వర్సెస్ జనసేన
పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి, చిట్టి తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు చిట్టి బయటపెట్టడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు చిట్టి (33)తో 2009లో వివాహం జరిగింది. శేఖర్ కారు డ్రైవింగ్, చిట్టి బట్టల షాపులో పని చేస్తుంది.. శేఖర్ చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.. పోలీసులు ఉస్మానియాకు శేఖర్ మృతుదేహాన్ని తరలించారు.. ఇవ్వాళ పోస్టుమార్టం పూర్తికానున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!