Vizag Hotels: విశాఖ హోటల్స్కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!
- ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం
- విశాఖ హోటల్స్కు తాకిన యుద్ధ ప్రభావం
- ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్నంలోని హోటల్ రంగానికీ తాకింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో విశాఖలో కూడా హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలో గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని హోటల్ యజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.1300 ఉండగా.. ప్రస్తుతం అది రూ.1700 దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
విశాఖ నగరంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 1000 హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా దాదాపు 65 వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కేవలం 12 నుంచి 14 వేల సిలిండర్లను మాత్రమే సరఫరా చేయగలమని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు మూడు షిఫ్టులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేదని, కానీ ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా జరుగుతోందని హోటల్ యజమానులు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని హోటల్స్ అసోసియేషన్ కోరుతోంది. గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చి హోటల్ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?