Vizag Hotels: విశాఖ హోటల్స్కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!
- ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం
- విశాఖ హోటల్స్కు తాకిన యుద్ధ ప్రభావం
- ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్నంలోని హోటల్ రంగానికీ తాకింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో విశాఖలో కూడా హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలో గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని హోటల్ యజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.1300 ఉండగా.. ప్రస్తుతం అది రూ.1700 దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
విశాఖ నగరంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 1000 హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా దాదాపు 65 వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కేవలం 12 నుంచి 14 వేల సిలిండర్లను మాత్రమే సరఫరా చేయగలమని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు మూడు షిఫ్టులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేదని, కానీ ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా జరుగుతోందని హోటల్ యజమానులు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని హోటల్స్ అసోసియేషన్ కోరుతోంది. గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చి హోటల్ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..