HYD Harassment: యువతులు, మహిళలను తాకుతూ శునకానందం.. వందలాది మంది ఆకతాయిలపై కేసులు!
- యువతులు, మహిళలను తాకుతూ శునకానందం
- వందలాది మంది ఆకతాయిలపై కేసులు
- మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసిన మహిళ
- బైక్ నెంబర్ ఆధారంగా యువకుల గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో పోకిరీల ఆగడాలు మితిమీరాయి. బోనాలు.. వినాయక వేడుకలు.. దేవీ నవరాత్రులు.. న్యూ ఇయర్.. హోలీ.. సందర్భమేదైనా సరే ఆకతాయిల టార్గెట్ అంతా అమ్మాయిలపైనే. కామెంట్ చేయడం.. యువతులను, మహిళలను తాకుతూ, వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. శునకానందం పొందుతున్నారు. తాజాగా బైక్ వెళ్తున్న మహిళలను.. యువకులు వెంబడిస్తూ నెమలి ఈకతో టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైరల్ ఐన వీడియో ఆధారంగా యువకులను గుర్తించి పట్టుకుని తాట తీశారు పోలీసులు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాజాగా జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. యువతులు, మహిళలను తాకుతూ శునకానందం పొందారు. ఇందులో యువకులే కాదు.. అంకుల్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లందరి తాట తీశారు పోలీసులు. వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను షీ టీమ్స్ వీడియోలతో సహా రికార్డ్ చేసింది. గుర్తించి పట్టుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా బోనాలు ముగిసే వరకు వందలాది మంది ఆకతాయిలపై కేసులు పెట్టారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తాజాగా మాదాపూర్లో కుర్రాళ్లు రెచ్చిపోయారు. బైక్ వెళ్తున్న యువతులను.. ముగ్గురు యువకులు బైక్పై వెంబడించడమే కాకుండా… వెనక కూర్చున్న యువకుడు నెమలి ఈకతో యువతులను కొడుతూ వేధించాడు. ఇలా కొద్ది దూరం వరకు వెంబడించి యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. ముగ్గురు యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతులు బైక్ను వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఐనా యువకులు వెంబడించారు. ఈ తతంగం అంతా… వెనకాలే వస్తున్న కారులోని మహిళ తన మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసింది. యువకుల బైక్ సమీపం వరకు వెళ్లి.. వారించింది. ఏం చేస్తున్నారు.. అంటూ మందలించింది. దీంతో ఆ ముగ్గురు యువకులు స్పీడ్గా వెళ్లిపోయారు.
మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసిన మహిళ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పోలీసులకు ట్యాగ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోను గుర్తించిన పోలీసులు.. ఆ బైక్ నెంబర్ ఆధారంగా యువకులను గుర్తించారు. వరంగల్ కి చెందిన ముగ్గురు యువకులు.. హైదరాబాద్లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చదువు, ఉద్యోగం లేకుండా.. జులాయిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు.. యువకుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఎవరూ గమనించరు కదా అని తుంటరి చేష్టలకు పాల్పడినా.. యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రానున్న వినాయక నిమజ్జనం, దేవీ నవరాత్రుల ఉత్సవాల్లోనూ ఇలాంటి చేష్టలకు పాల్పడే వాళ్లపై పోలీసుల నజర్ ఉంటుందని.. పిచ్చి చేష్టలకు పాల్పడితే కేసులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..