అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. అక్కడే కారు రూపు రేఖలు మార్చేశారు. తక్కువ ధరకు కారు విక్రయించేసి డబ్బులు తీసుకుని చెక్కేశారు. ఇక కారు యజమాని అడిగితే.. ట్రిప్లోనే ఉన్నామని బురిడీ కొట్టించిన బే’కార్’గాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు.. హైదరాబాద్లో కొంత మంది కేటుగాళ్లు.. జల్సాలకు అలవాటు పడి.. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు.…
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపిన యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. పది రోజులుగా ఆచూకీ లేని యువకుడు ఓ పాడుబడిన బావిలో శవమై తేలడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న నేరాలు, అనుమానాస్పద మరణాల నేపథ్యంలో ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది. బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. హైదరాబాద్లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ కుమార్ (20) అనే యువకుడు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. మార్చి 4వ తేదీన ఇంటి నుంచి…
చేతిలో స్టెతస్కోప్.. ఒంటిపైన డాక్టర్ కోటు.. దర్జాగా లోపలికి ఎంట్రీ.. ఆ తర్వాత నింపాదిగా ఆస్పత్రి నుంచి ఎగ్జిట్. సీన్ కట్ చేస్తే ఓ మహిళా పేషెంట్ మెడలో బంగారు ఆభరణాలు చోరీ. ఆస్పత్రి నిండా సీసీ కెమెరాలు.. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది.. అయినా పసిగట్టని వైనం. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఘటన. మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కొట్టేసింది ఎవరు? ఆస్పత్రి సిబ్బంది ఏం తేల్చింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోయిన్పల్లికి చెందిన…
Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉంది. కోమలి ఆత్మహత్యకి ఒకరోజు…
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్పేట్లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది?…
Hyderabad: హైదరాబాద్లోని అంబర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంట్లో రామ్ రాజ్ (55), మాధవి (50) ఇద్దరు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్య పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల…
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు…
Vanasthalipuram Murder: కలహాలు.. కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. భార్య, భర్త మధ్య తలెత్తుతున్న వివాదాలు..ఒక్కోసారి ఎవరో ఒకరిని చంపుకునే వరుకు వెళ్తున్నాయి. వివాహేతర బంధాలు కావచ్చు..లేదా కుటుంబ కలహాలు కావచ్చు..లేదా మద్యం లాంటి వ్యసనాలు కావచ్చు.. వరకట్న వేధింపులు కావచ్చు.. ఇలా సమస్య ఏదైనా కొంత మందికి మాత్రం హత్యలే పరిష్కారంగా కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇలాంటి హత్యలే రెండు జరిగాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వనస్థలిపురంలో మాజీ భార్యను మాజీ భర్త హత్య…
HYD DRUGS ARREST: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ముఠాలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. ఒక రోజు కాకపోయినా మరో రోజైనా పట్టుకుంటున్నారు. తాజాగా కొత్త తరహాలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
Hyderabad ATM Theft: నైస్గా స్కెచ్చేశాడు.. స్మార్ట్గా దోచేశాడు.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.. చోరీ చేసిన సొమ్ముతో షాపింగ్లు, జల్సాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు..!! ఏం చోరీ చేశాడో తెలుసుకుందాం.. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పట్టపగలే ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనాన్ని అందులో పని చేస్తున్న డ్రైవరే ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసు ఒక్కసారిగా సిటీలో సంచలనంగా మారింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్లో దాదాపు రూ.60 లక్షల నగదు ఉన్నట్లుగా మేనేజ్మెంట్…