Telangana: తెలంగాణలో నేడే పథకాల ప్రారంభం.. సీఎం, మంత్రుల షెడ్యూల్ ఇదే
- నేడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు..,
- నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్
- కోస్గి మండలం చంద్రవంచలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్న సీఎం
- ఖమ్మం జిల్లా కొణిజర్లలో నాలుగు పథకాలు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఎవరెవరు ఏ జిల్లాల్లోని గ్రామాల్లో పథకాలు ప్రారంభించనున్నారో తెలుసుకుందాం……….
Read Also: Lady Aghori: కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్చల్..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు పథకాలు ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో 4 పథకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మంజుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నల్గొండ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
మలుగు జిల్లా జీవంతరావుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
కొల్లాపూర్లో నిర్వహించనున్న ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!