Telangana: తెలంగాణలో నేడే పథకాల ప్రారంభం.. సీఎం, మంత్రుల షెడ్యూల్ ఇదే
- నేడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు..,
- నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్
- కోస్గి మండలం చంద్రవంచలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్న సీఎం
- ఖమ్మం జిల్లా కొణిజర్లలో నాలుగు పథకాలు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఎవరెవరు ఏ జిల్లాల్లోని గ్రామాల్లో పథకాలు ప్రారంభించనున్నారో తెలుసుకుందాం……….
Read Also: Lady Aghori: కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్చల్..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు పథకాలు ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో 4 పథకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మంజుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నల్గొండ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
మలుగు జిల్లా జీవంతరావుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
కొల్లాపూర్లో నిర్వహించనున్న ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!