Telangana: తెలంగాణలో నేడే పథకాల ప్రారంభం.. సీఎం, మంత్రుల షెడ్యూల్ ఇదే
- నేడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు..,
- నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్
- కోస్గి మండలం చంద్రవంచలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్న సీఎం
- ఖమ్మం జిల్లా కొణిజర్లలో నాలుగు పథకాలు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఎవరెవరు ఏ జిల్లాల్లోని గ్రామాల్లో పథకాలు ప్రారంభించనున్నారో తెలుసుకుందాం……….
Read Also: Lady Aghori: కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్చల్..
Also Read
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు పథకాలు ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో 4 పథకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మంజుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నల్గొండ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
మలుగు జిల్లా జీవంతరావుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
కొల్లాపూర్లో నిర్వహించనున్న ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!