T20 World Cup 2024: భారత్ సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!
- ప్రపంచకప్లో టీమిండియాకు నిరాశే
- సెమీస్ చేరుతుందనుకుంటే సీన్ రివర్స్
- కనీస ప్రదర్శన ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది.
టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే ముందు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు, తుది ఫలితంకు ఏ సంబంధం లేదు. టీ20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు అని, 12 మందికి ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉందని, వారి సత్తాపై నాకు బాగా నమ్మకముందన్న హర్మన్ప్రీత్ వ్యాఖ్యలు అందరిలో టైటిల్ ఆశలు రేపినా.. చివరకు నిరాశ పడక తప్పలేదు. గత మూడు ప్రపంచకప్లలో సెమీస్, ఫైనల్, సెమీస్ రికార్డు.. యూఏఈలో వాతావరణం, పిచ్లు భారత్కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారం.. డబ్ల్యూపీఎల్లో మన ప్లేయర్స్ రాణించడం లాంటివి ఏమీ కలిసిరాలేదు.
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!
టీ20 ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ ఒక్కతే రెండు అర్ధ సెంచరీలతో రాణించింది. టాప్-5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్మృతి మంధాన మూడు కీలక మ్యాచ్లలో తేలిపోయింది. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్రౌండర్ దీప్తి శర్మ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్ పర్వాలేదనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్స్ తీశారు. ఆశా శోభన కూడా రాణించింది. సమష్టి వైఫల్యమే భారత్ కొంపముంచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలో భారత్ రెండు గెలిచి, రెండింటిలో ఓడింది.
తాజావార్తలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!