Satyavathi Rathod : ఒళ్లు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హాత్ సే హాత్ జోడో పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ యాత్ర ములుగు నియోజకవర్గంలో రెండు రోజులు కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి భవన్ పదెకరాల విస్తీర్ణంలో 110 గదులతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారని.. కానీ ప్రగతి భవన్ పేద ప్రజలకు ఉపయోగపడదన్నారు. ఆ భవనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని భవనాన్ని నక్సలైట్లు పేల్చేయాలన్నారు. గతంలో మావోలు దొరల గడీలను పేల్చి వేసినట్టు ప్రగతి భవన్ ను కూడా పేల్చివేయాలని.. నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శిబిరంలోని నేతలకు కోపం తీసుకువచ్చింది. దీంతో.. బీఆర్ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Also Read : Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారు
Also Read
ఈ క్రమంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ లైనా? అని ప్రశ్నించారు. నక్సలైట్లను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ.. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటి? అని ఆమె అన్నారు. అనర్హుడైన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఇలాంటి గతి పడుతుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆమె అన్నారు. ఇలానే రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ పోతే… భవిష్యత్ లో తిరగలేవని ఆమె హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి యాత్ర మానుకోట దాటదు అని అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. లేని నక్సలైట్లను ముందు పెట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏంటి అని ఆమె అన్నారు.
Also Read : Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!