ట్రాన్స్జెండర్ల పెళ్లి ఎలా ఉన్నా వారికి మాతృత్వ, పితృత్వ ఆనందం మాత్రం దక్కే అవకాశం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని, జీవితంలో పిల్లలు పుడితే కలిగే ఆనందాన్ని పొందింది ఓ ట్రాన్స్జెండర్ జంట.కేరళకు చెందిన జియా, జహద్ దంపతులు పండంటి బిడ్డను కన్నారు. దీంతో వీరు దేశ చరిత్రలోనే బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జంటగా నిలిచారు. దేశంలో తొలిసారిగా వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి సృష్టికి భిన్నంగా తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన ఈ ట్రాన్స్ జెండర్ జంట బుధవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగా మారిన అతడు వెల్లడించాడు.
Also Read: ICC T20 Rankings: నెంబర్వన్కు చేరువలో హార్దిక్ పాండ్యా..గిల్ దూకుడు
ఇటీవలే జియా తన ఇన్స్టాగ్రామ్లో జహద్ 8 నెలల గర్భవతి అని.. మార్చి 4న బిడ్డకు జన్మనిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు జహద్కు సిజేరియన్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని జియా తెలిపారు.
బిడ్డకు జన్మనివ్వడం పట్ల ట్రాన్స్జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ పైలట్ అయిన ఆడమ్ హ్యారీ కూడా.. తన జీవితంలో ఇంతటి ఆనందాన్ని అనుభవించలేదని జియా అన్నారు. అయితే వారిని పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. జహద్ తన బిడ్డకు పాలిచ్చే వీలు లేనందున.. ఆస్పత్రి పాల బ్యాంక్ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు వైద్యులు. తల్లిదండ్రులైన వీరికి పలువురు అభినందనలు తెలిపారు.
Also Read: Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…