Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sajjala Ramakrishna Reddy Sensational Comments On Tdp Janasena Bjp Alliance

Sajjala Ramakrishna Reddy: పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు..

NTV Telugu Twitter
Published Date :March 18, 2024 , 7:34 pm
By Chandra Shekhar
Sajjala Ramakrishna Reddy: పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.. ఆ రోజు ఇచ్చిన హామీలు.. ప్రత్యేక హోదాతో సహా తర్వాత ఏమి అయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు చేశారు? అంటూ అడిగారు. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు.. కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిత్వహననం చేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.

Read Also: Mukesh Khanna: శక్తిమాన్ గా రణవీర్.. ఛీఛీ.. అతను శక్తిమాన్ ఏంటి.. ఒంటిపై బట్టలు లేకుండా..

ఇక, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు పార్టీలు ఒకే స్టేజీపైకి వచ్చారు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2014లో ఇచ్చిన హామీల విషయంలో చిలకలూరిపేట సభలో మూడు పార్టీలు ప్రజలకు సంజాయిషీ ఇవాల్సింది అని అన్నారు. ప్రజలను మోసగిస్తామనే భావన వాళ్ల ముఖాల్లో కనిపించడం లేదు.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 2014లో 600 వందల హామీలు ఇచ్చారు చంద్ర బాబు.. హామీల అమలు విషయంలో సంజాయిషీ ఇవ్వాలి మూడు పార్టీలు అని అన్నారు. ఏ మొహం పెట్టుకుని మూడు పార్టీలు ఒకే స్టేజీ మీదకు వచ్చారు అని ప్రశ్నించారు. అబద్ధాలు, వంచనకు ప్రతిరూపం చిలకలురిపేట సభలో మూడు పార్టీల కూటమి అంటూ సజ్జల ఆరోపించారు.

Read Also: MLC Jeevanreddy: కేసీఆర్కు పట్టిన గతే మోడీకి పడుతుంది.. తీవ్ర విమర్శలు

కేవలం సీఎం జగన్ మీద దుమ్మెత్తి పోయడం పనిగా ఈ మూడు పార్టీల నేతలు పెట్టుకున్నారు అని సజ్జల అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తారో సభలో చెప్పలేకపోయారు.. చిలకలూరిపేటలో కూటమి సభ ఫెయిల్ అయ్యింది.. సభలో వాళ్ల మైక్ సిస్టం ఫెయిల్ అయితే.. పోలీసులకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. పొరపాటున కరెంట్ పోతే.. మాదే తప్పు అనే వాళ్ళు.. ప్రధానికి మోడీకి సన్మానం అంటారు కానీ, శాలువా రాదు.. ఇదేక్కడి విచిత్రం అని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని హోదాలో వస్తే జగన్ ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కును ప్రస్తావించారు.. హోదా అంశంను సభలో ఎందుకు మూడు పార్టీలు ఎందుకు ప్రస్తావించలేదు.. జగన్ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం బలంగా ఉంది.. విశ్వసనీయతకు వారెంటి అవసరం లేని గ్యారెంటీ జగన్.. చెప్పిన దాని కంటే ఎక్కువ చేశారు జగన్ .. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Read Also: Ballistic Missiles: మూడు బాలిస్టిక్ మిస్సైళ్లను ప‌రీక్షించిన నార్త్ కొరియా..

జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు మోసాలను అప్రమత్తంగా ఉండి ప్రజలు తిప్పికొట్టాలి.. చంద్ర బాబు కూటమి మోసపూరిత పాలన ఒక వైపు.. చెప్పిన దాని కంటే ఎక్కువ చేసిన జగన్ విశ్వసనీయత ఉన్న పాలన మరో వైపు ఉందన్నారు. మరో ఐదేళ్లు ఈ స్కీమ్ లు కొనసాగాలంటే జగన్ పాలన రావాలి.. వైసీపీ- కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి అంటే ప్రజలు నమ్మరు అని సజ్జల పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • chandrababu
  • elections 2024
  • sajjala ramakrishna reddy

తాజావార్తలు

  • Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!

  • Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

  • Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?

  • Black Box: కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’.. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions