Sajjala Ramakrishna Reddy: 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి.. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే కోర్టుకు వెళ్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించేవారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తాం అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండేళ్ల నుంచి వాలంటీర్లపై చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థ జగన్ తీసుకువచ్చారు.. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇస్తే జనం తరుముతారు అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారని విమర్శించారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు తెలియదా? ఏమి జరిగిందో.. వాలంటీర్ల విషయంలో అని ప్రశ్నించారు సజ్జల.. జన్మభూమి కమిటీలు.. టీడీపీ జలగలతో ఉండేది.. ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారని తెలిపారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆయన.. ఇప్పుడు 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. రెండు మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి అవుతుందన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పెన్షన్ల పంపిణీ వ్యవహరంలో టీడీపీ మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారు.. వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏమి చేయలేరన్నారు. 20 మంది అధికారులు వైసీపీ వాళ్లు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట.. అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ల తోత్తులు అయ్యి ఉండాలి అని దుయ్యబట్టారు సజ్జల.
Also Read
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
టీడీపీ కూటమి ఈసీ మీద ఒత్తిడి చేస్తున్నారు.. వారు లొంగిపోతున్నారు అని ఆరోపించారు సజ్జల.. అఖిల భారత అధికారుల బదిలీలకు ఈసీ కారణం చెప్పాల్సి ఉండేదన్నారు.. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైసీపీకి లేదన్నారు. పవన్ కల్యాణ్ది ఒక రాజకీయ పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమికి చెప్పడానికి ఏమీ లేదు.. కూటమి ఇచ్చే హామీలు కూడా గట్టిగా చెప్పడం లేదు.. ఇప్పటికే కూటమి మునిగిపోయింది, దివాళా తీసిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు.. ఐదేళ్లలో వైఎస్ షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడలేదు.. ఇప్పుడు మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు. షర్మిల, సునితతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు.. బాబు చేతిలో పావులు అయ్యారు అని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
-
Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్లాండ్లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
-
Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం… ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
-
Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!