Arshdeep Singh: ఇబ్బంది పడతానేమో అనిపించింది.. రాహుల్ భాయ్కి కృతజ్ఞతలు: అర్ష్దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Said I would thank KL Rahul: తాను చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా అని టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. వికెట్ టు వికెట్ బంతులు బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయన్నాడు. తనకు అవకాశం ఇచిన కెప్టెన్ లోకేష్ రాహుల్ కి కృతజ్ఞతలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసిన అర్ష్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం అర్ష్దీప్ సింగ్ మాట్లాడుతూ… ‘నాకు కొంచెం నొప్పిగా ఉంది. కానీ ఈ క్షణాన్ని బాగా ఆస్వాదిస్తున్నా. ఆ దేవుడికి మరియు టీమ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. ఇది సాధారణ మైదానాల కంటే కొంచెం భిన్నంగా ఉంది. నా బౌలింగ్ పట్ల సంతోషంగా ఉన్నా. వ్యక్తిగతంగా నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ అవకాశం (సుదీర్ఘ స్పెల్) ఇచ్చి ఐదు వికెట్లు తీయగలవని ఎంకరేజ్ చేసిన రాహుల్ భాయ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏమీ ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించాలని నేను అనుకుంటున్నాను. ఇక రాబోయే మ్యాచ్లపై దృష్టి పెట్టాలి’ అని తెలిపాడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Also Read: Parliament Security Breach: పార్లమెంట్ ఘటనపై ప్రధాని ముఖం చాటేస్తున్నారు.. చర్చ అవసరమే!
‘వన్డేల్లో ఇప్పటివరకు గొప్ప గణాంకాలు నమోదు చేయలేదు. ఈసారి అద్భుతమైన ఆరంభం దక్కింది. పిచ్ నుంచి సహకారం దొరికింది. మ్యాచ్కు ముందు పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా మూమెంట్ ఉండదనుకున్నాం. అనూహ్యంగా బంతి స్వింగ్కు అనుకూలంగా మారింది. వికెట్ టు వికెట్ బంతులను సంధిస్తే చాలనుకున్నాం. అలాగే బౌలింగ్ చేయడంతో వికెట్లు దక్కాయి. చాలా రోజుల తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ఆడా. ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా. 5 వికెట్ల ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది’ అని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?