Harish Rao : రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
- రైతులకు మోసమే మిగిలిందా?
- రైతు బంధుతో పోల్చుతూ రేవంత్పై ధ్వజమెత్తిన హరీష్
- ఇందిరమ్మ భరోసా పథకం కేవలం మాటలకే పరిమితమైంది: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రైతు భరోసా అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఆ హామీ ఇంకా నెరవేరలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 కల్లా రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏప్రిల్ 1వ తేదీ వచ్చేసినా ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆయన మండిపడ్డారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఉగాది పండుగను పురస్కరించుకుని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూశారని, అయితే వారికి ప్రభుత్వం చేదు అనుభవం మిగిల్చిందని హరీష్ రావు విమర్శించారు. దసరాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, సంక్రాంతికి అందిస్తామన్నా నిధులు రాలేదని, ఉగాది నాటికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం బాధాకరమన్నారు. కాలండర్లు మారుతున్నా రేవంత్ రెడ్డి మాట మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.
నాట్ల సీజన్లో కేసీఆర్ రైతులకు రైతు బంధు అందించారని, కానీ రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా అందించలేకపోయారని హరీష్ రావు ఆరోపించారు. మోసపూరిత పాలననే విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతులను అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని ఆరోపించారు.
‘‘రుణమాఫీ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఇందిరమ్మ భరోసా పథకం కేవలం మాటలకే పరిమితమైంది. హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే, అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే రైతు భరోసా నిధులు అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల్లో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటుంది’’ అని హరీష్ రావు హెచ్చరించారు.
Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!