Budameru: బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు.. స్పందించిన మంత్రి
- బెజవాడ వాసులను పరుగులు పెట్టించిన బుడమేరు ముంపు ప్రచారం
- బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు
- స్పందించిన మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru: బెజవాడ వాసులను బుడమేరు ముంపు ప్రచారం పరుగులు పెట్టించింది. బుడమేరుకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్ళీ ఇళ్లలోకి వరదనీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంతాల వారు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి కంగారు పడిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఫేక్ ప్రచారంగా అధికారులు చెబుతున్నారు. ఎవరు ఈ ప్రచారం చేశారు అనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
Read Also: Minister Narayana: విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి ఆగ్రహం
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందని కొద్దిసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతున్న తెలిసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, ఈఎన్సీ గోపాల కృష్ణా రెడ్డితో ఫోన్లో మాట్లాడి మంత్రి నారాయణ సమాచారం తెలుసుకున్నారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. విజయవాడ పూర్తిగా సేఫ్గా ఉందని మంత్రి స్పష్టం చేశారు. బెజవాడలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. బుడమేరు కట్ట మళ్ళీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రచారాలు నమ్మవద్దని పేర్కొ్న్నారు.
బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. బుడమేరుకు ఎలాంటి వరదనీరు రావటం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఈ తరహా వదంతుల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు గుర్తించామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!