శివరాత్రి కానుకగా బీహార్ మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో నారీమణులంతా ఖుషిఖుషిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: US-Iran: మెత్తబడ్డ ఇరాన్.. అమెరికాతో అణు ఒప్పందానికి గ్రీన్సిగ్నల్!
గత నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో మహిళలంతా పెద్ద ఎత్తున ఓటింగ్కు తరలివచ్చి బీజేపీ కూటమికి గుద్దేశారు. దీంతో భారీ మెజార్టీతో నితీష్ కుమార్ కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకున్నారు. తిరిగి అదే జోష్లో ఉన్న నితీష్ కుమార్ తాజాగా మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి. శివరాత్రి సమయంలో డబ్బులు పడడంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్