HCA: హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ..
- బుచ్చిబాబు టోర్నమెంట్ లో గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సీఏ ఆధ్వర్యంలో సన్మానం
- చెన్నై వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన హైదరాబాద్ టీమ్
- హైదరాబాద్ టీమ్ కి రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఛాంపియన్గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్మోహన్ రావు ప్రకటించారు.
Read Also: CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
Also Read
- August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- కొత్త 'ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే'తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
గత రంజీ సీజన్లో ప్లేట్ డివిజన్లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్.. బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ ఇతర జట్లను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా.. జగన్మోహన్ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందన్నారు. గత సీజన్లో రంజీ ప్లేట్ ఛాంపియన్గా నిలిచాం.. ఈ సీజన్లో రంజీ ఎలైట్ ఛాంపియన్గా నిలువాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో.. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్సీఏ అందించేందుకు సిద్ధంగా ఉందని జగన్మోహన్ తెలిపారు.
శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ టీమ్, కోచ్ చటర్జీని హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాగా.. ఫైనల్లో ఛత్తీస్ఘడ్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 236 పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆట తీరు కనబరిచింది.
🏆 ₹25 Lakh Prize Money to the Champions!🏆
It was an honor to felicitate the Hyderabad Cricket Team today at RGICS, Uppal, after their thrilling victory in the All India Buchi Babu Tournament!🎉
I am pleased to announce a prize money of ₹25 lakh to celebrate their… pic.twitter.com/4zBy5FJVTs
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) September 13, 2024
తాజావార్తలు
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
-
August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!