హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్గఢ్లతో జరిగే రంజీ మ్యాచ్లకు సిరాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్..…
ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఛాంపియన్గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్మోహన్ రావు ప్రకటించారు.