Voting: 8 సార్లు ఓటు వేసిన యువకుడు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా.. సోమవారం 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అన్నీ చోట్ల ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. ఓ యువ ఓటర్.. ఎనిమిది సార్లు ఓటు వేశాడు. అంతేకాకుండా.. తాను ఓటేసే వీడియోను రికార్డు చేశాడు. అయితే.. ఈ వీడియో బయటకు రావడతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో యువకుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎంల)లో ఓటు వేస్తున్నాడు. ఓటు వేస్తుండగా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. కాగా.. ఇది నాలుగో దశ పోలింగ్ లో జరిగింది. మే 13న యూపీలోని ఫరూఖాబాద్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్ పేరు పక్కన ఉన్న బటన్పై నొక్కాడు. కొద్దిసేపటి తర్వాత.. యువకుడు మళ్లీ క్యూబికల్లో ఉన్నాడు, అంతేకాకుండా కెమెరాలో చూపిస్తూ “ఇది నంబర్ 2” అని చెప్పాడు. మరో రౌండ్ ఓటింగ్ తర్వాత, “ఇది మూడోది” అని చెప్పాడు.
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
AI for Google Search: ఇక గూగుల్ సెర్చ్ లో కుడా ఏఐ.. ఈ 8 ఫీచర్లు అస్సలు మిస్ కావద్దు!
ఈ విధంగా యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేయడం వీడియోలో రికార్డ్ చేశాడు. అయితే.. అతను చూపిస్తున్న వీడియోలో ఒక్కోదానిలో ఒక చొక్కాలో కనిపించాడు. కొన్ని నివేదికల ప్రకారం, వీడియోలో ఉన్న యువకుడు.. ఏడుసార్లు పోల్ అధికారుల పరిశీలనను ఎలా దాటవేశారనేది స్పష్టంగా తెలియలేదు. కాగా.. ఈ ఘటనలో యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆ పోలింగ్ బూత్ లో ఉన్న పోలింగ్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తామని, పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్కు సిఫార్సు చేశామని యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు. కాగా.. ఎనిమిది సార్లు ఓటు వేసినట్లు యువకుడు అంగీకరించాడని సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ సింగ్ కుష్వాహా వార్తా సంస్థ AFPకి తెలిపారు.
మరోవైపు.. ఈ వైరల్ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. “ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒత్తిడి చేసి ప్రజాస్వామ్యాన్ని దోచుకోవాలని చూస్తోంది” అని ఆరోపించారు. మరోవైపు.. సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఎక్స్లో వీడియోను షేర్ చేశారు. “ఎలక్షన్ కమిషన్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, బీజేపీ బూత్ కమిటీ లూట్ కమిటీ” అనే పోస్ట్ చేశారు.
अपनी हार सामने देख कर भाजपा जनादेश को झुठलाने के लिए सरकारी तंत्र पर दबाव बना कर लोकतंत्र को लूटना चाहती है।
कांग्रेस चुनावी ड्यूटी कर रहे सभी अधिकारियों से यह अपेक्षा करती है कि वो सत्ता के दबाव के सामने अपनी संवैधानिक ज़िम्मेदारी न भूलें।
वरना INDIA की सरकार बनते ही ऐसी… https://t.co/fk4wXL8QZy
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2024
తాజావార్తలు
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టాడేమో!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!