Crime News: హర్యానాలో శ్రద్ధా వాకర్ లాంటి ఘటన.. ట్రాలీబ్యాగ్లో కుళ్లిపోయిన మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: దేశంలో ఏదో ఓ మూలన మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని రేవారిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై కసోలా ఫ్లైఓవర్ సమీపంలోని పొలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఆ మహిళ చనిపోయి పది రోజులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ రైతు తన పొలంలో ఓ ట్రాలీ బ్యాగ్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ శరీర అవయవాలను గుర్తించి తమకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనల్వాస్ గ్రామానికి చెందిన రైతు రాంపాల్ రాత్రి సమయంలో తన పొలానికి వెళ్లినప్పుడు పొదల్లో నల్లటి ట్రాలీ బ్యాగ్, చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. ఆ ట్రాలీ బ్యాగ్ తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన శరీర భాగాలు ఉన్నాయి. దీంతో అతను ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఆ శరీర భాగాలు ఎవరివో కూడా గుర్తించే పరిస్థితి లేకుండా మృతదేహం కుళ్లి పోయింది. దీంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ చేరుకుని ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. హత్య జరిగి దాదాపు 10 రోజులు అయి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ మృతదేహం ఎవరిదనే కోణంలో విచారణ చేపట్టారు. ఎవరో మహిళను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆమె మృతదేహాన్ని పారేసినట్లు అనిపించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
India-China Clash: పార్లమెంట్ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్
ఘటనాస్థలంలోని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మంగళవారం అర్థరాత్రి కసోలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో నిందితులను పట్టుకుంటామని కసోలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో మనోజ్ కడియాన్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!