Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sonia Gandhi Leads Opposition Walkout In Parliament About Indian China Clash

India-China Clash: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్‌

Published Date :December 14, 2022 , 3:51 pm
By Mahesh Jakki
India-China Clash: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-China Clash: అరుణాచ‌ల్‌ప్రదేశ్‌లోని త‌వాంగ్ సెక్టార్‌లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్షణ వ్యవ‌హారం పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌నూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే, 1962లో జరిగిన చైనా యుద్ధంపై దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత్‌పై లోక్‌సభలో చర్చకు అనుమతించారని.. ఇండో-చైనా సరిహద్దు పరిస్థితిపై చర్చ జరగాలని కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. తాము భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నామని, 1962లో, భారతదేశం-చైనా యుద్ధం జరిగినప్పుడు, జవహర్‌లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారని.. ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.

కాంగ్రెస్ నేత డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్పీకర్ సభా కార్యకలాపాలను కొనసాగిస్తున్నప్పుడు, కాంగ్రెస్, అలాగే టీఎంసీ నిరసనగా వాకౌట్ చేశాయి. భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించాయి. టీఎంసీ లోక్‌సభ సభ్యుడు సుదీప్ బంద్యోపాధ్యాయ కూడా సభలో చర్చకు డిమాండ్‌ను లేవనెత్తుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నారని అన్నారు. అంతకుముందు వివిధ అంశాలపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.

ఆరోజు సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు కొన్ని అంశాలను లేవనెత్తాలని భావించారు. సభ్యుల్లో ఒకరు “జస్టిస్ ఫర్ స్టాన్ స్వామి” అనే ప్రింట్ అవుట్‌ను ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల సమయం ముఖ్యమని, అది తమ కోసమేనని స్పీకర్ నిరసన వ్యక్తం చేసిన సభ్యులకు చెప్పారు. అయితే, వారు వివిధ సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే కొంత సేపటి తర్వాత కొందరు సభకు వచ్చారు.

India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై స‌మ‌గ్ర చ‌ర్చకు స్పీక‌ర్ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో రాజ్యస‌భ నుంచి బుధ‌వారం 17 విప‌క్ష పార్టీలు వాకౌట్ చేశాయి. తొలుత స‌భ ప్రారంభం కాగానే డిసెంబ‌ర్ 9న భార‌త్‌, చైనా సేన‌ల ముఖాముఖిపై స‌వివ‌ర చ‌ర్చకు ప్రతిప‌క్షాలు ప‌ట్టుప‌ట్టాయి. చ‌ర్చకు ప్రభుత్వం అనుమ‌తించ‌నందుకు నిర‌స‌న‌గా ప్రతిప‌క్షాలు మూకుమ్మడిగా స‌భ నుంచి వాకౌట్ చేశాయి. మ‌రోవైపు లోక్‌స‌భ‌లోనూ తవాంగ్ సెక్టార్‌లో భార‌త్, చైనా సేన‌ల మ‌ధ్య ఘ‌ర్షణ వ్యవ‌హారం గంద‌ర‌గోళానికి దారితీసింది. స‌రిహ‌ద్దులో చైనా దురాక్రమ‌ణ‌పై స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుతున్నామ‌ని కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్రభుత్వాన్ని నిల‌దీశారు. స‌రిహ‌ద్దులో చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిలు, నివాసాల‌పై ర‌క్షణ మంత్రి ఎలాంటి స‌మాచారం ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. ఈ వ్యవ‌హారంపై విప‌క్షాలు ప్రభుత్వాన్ని నిల‌దీస్తూ నినాదాలు చేయ‌డంతో లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా అస‌హ‌నం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arunachal pradhesh clash
  • congress
  • India China Clash
  • India-China border clash
  • Loksabha

తాజావార్తలు

  • UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

  • Virosh: ఏందయ్యా మాకీ గోల?

  • Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్

  • Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?

  • Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions