Minister Roja: బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంత్రి ఆర్.కె. రోజా మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణీ మాట్లాడిన మాటలకు ఆమే కౌంటరిచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందని మంత్రి రోజా విమర్శించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా అని ప్రశ్నించారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని ఎద్దేవా చేశారు. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడన్నారు.
Read Also: Telangana : 97 ఏళ్ల వయస్సులో కులవృత్తిని వదలని వృద్ధుడు.. హ్యాట్సాఫ్..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మీ మామ ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా అని బ్రాహ్మణీని ప్రశ్నించారు మంత్రి రోజా. మీ తాత ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు ఏంటో అర్థం అవుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలు లేవు అని బ్రాహ్మణీ అంటోందని.. ఒకసారి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఆధారాలు చూపిస్తారని పేర్కొన్నారు. బ్రాహ్మణికి చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనుకుంటుందా? లేక దేశానికి ప్రధానిగా చేశాడని అనుకుంటోందా అని దుయ్యబట్టారు.
Read Also: Husbands Legal Rights: భార్యా బాధితుల్లారా మేల్కోండి.. మీకున్న చట్టపర హక్కుల గురించి తెలుసుకోండి?
మరోవైపు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చి కళ్యాణ్ కు ప్రపంచంలో ఉన్న అందరూ పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడని.. జగన్ రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్ళు అయిందని తెలిపారు. రెండు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఒకసారి ప్రతిపక్ష నేతగా, 151 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి రోజా అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ బతుకు ఎంత అని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయినా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేపోయాడని విమర్శించారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ స్థాయికి మించి మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
- Tags
- brahmani
- counter
- RK Roja
- tdp
- telugu news
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!