Rohit Sharma: ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలో ఆడటానికేనా..?
- వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ
- సెంటర్ వికెట్పై బ్యాటింగ్ చేస్తూ కనిపించిన రోహిత్
- బ్యాటింగ్ చేస్తూ కనిపించిన అజింక్య రహానే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా టూర్లో బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీ రెండింటిలోనూ విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ప్రస్తుతం కష్టంగా ఉంది. రోహిత్ శర్మ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో.. రోహిత్ తన కెరీర్ ను కాపాడుకోవడానికి నరకయాతన పడుతున్నాడు. తన ఫామ్పై విమర్శలు వెల్లువెత్తడంతో రోహిత్ శర్మ దానిపై కసరత్తు ప్రారంభించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. అతని బ్యాటింగ్పై ప్రశ్నలు తలెత్తాయి. మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే అతని ఫ్యాన్స్ రిటైర్మెంట్ ప్రకటించద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏదేమైనాప్పటికీ.. రిటైర్మెంట్ ప్రకటించలేదు.
Sankranthi Celebrations: కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్న అతిధులు..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న రోహిత్.. ఇప్పుడు అన్నీ పనులు వదిలేసి మైదానంలోకి దిగి మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో అతను సెంటర్ వికెట్పై బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతనితో పాటు టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే కూడా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. రోహిత్ తన బ్లూ కలర్ కారులో వాంఖడే స్టేడియానికి వచ్చాడు. రోహిత్ వైట్ డ్రస్తో బ్యాగ్, కిట్బ్యాగ్తో కనిపించాడు. ఆ సమయంలో అక్కడి చేరుకున్న తన ఫ్యాన్స్ ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
రోహిత్ ఇటీవల బీసీసీఐ సమావేశానికి హాజరయ్యాడు. ఆ సమావేశంలో జట్టు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఉన్నారు. ఈ సమావేశంలో దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్లపై దృష్టి సారించారు. అయితే.. రోహిత్ శర్మ ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసాడు కాబట్టి.. అతను రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్లో ఆడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ ఆడతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే అతను మళ్లీ ఫామ్లోకి రావడంపై ఫోకస్ పెట్టాడు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!