Rohit Sharma: మరో మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ..
- మరో మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ
- సెంచరీతో కొత్త రికార్డులు సృష్టించిన హిట్ మ్యాన్
- ఒక సంవత్సరంలో కనీసం ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును..,
- 13 సంవత్సరాలు గెలుచుకున్న రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు. చాలా కాలంగా ఫామ్లో లేని హిట్మ్యాన్.. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. రోహిత్ శర్మ 36వ సెంచరీతో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతని దూకుడు ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఒక సంవత్సరంలో కనీసం ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం ఇది అతని కెరీర్లో వరుసగా 13వ సంవత్సరం. ఒక సంవత్సరంలో ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంలో గొప్ప విషయం ఏమిటి..? అని అనుకుంటున్నారా.. గత 13 సంవత్సరాలలో విరాట్ కోహ్లీ , స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్, జోస్ బట్లర్, బాబర్ అజామ్ వంటి గొప్ప బ్యాట్స్మెన్లు ఈ ఫీట్ సాధించలేకపోయారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
30 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 30 ఏళ్ల తర్వాత 35 సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్మన్ సచిన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. సెంచరీ చేసిన అతి పెద్ద వయసు భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 49 శతకాలు బాదాడు. ఈ జాబితాలో సచిన్ టెండ్యూలర్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (81 సెంచరీలు) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి హిట్మ్యాన్ దూసుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులతో నాలుగో భారత బ్యాటర్గానూ ఉన్నాడు. సచిన్ (18,426 పరుగులు), కోహ్లీ (13,906), గంగూలీ (11,363) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
Read Also: Punjab: పంజాబ్ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!