Rohit-Kohli: అన్ని ఊహాగానాలకు చెక్.. 2027 ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ!
- వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్, కోహ్లీ
- టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజాలు
- 2027 ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ చెక్ పెట్టాడు. ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీలు ఆడుతారని హింట్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించిన బీసీసీఐ.. శుభ్మన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించింది. 2027 ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. దాంతో రోహిత్, విరాట్ కోహ్లీలు వన్డే ప్రపంచకప్ ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. వెస్టిండీస్తో జరిగే రెండో టెస్ట్కు ముందు గిల్ మాట్లాడుతూ.. ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ ఆడబోతున్నారని చెప్పకనే చెప్పాడు. వారి అనుభవం, నైపుణ్యాలు జట్టుకు చాలా ముఖ్యం అని అన్నాడు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
Also Read: Rinku Singh: రింకు సింగ్కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం, నైపుణ్యం చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. టీమిండియాకు ఎన్నో మ్యాచ్లలో విజయాలు అందించారు. వారి సామర్థ్యం, అనుభవం జట్టుకు చాలా అవసరం. ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్లో ఆడడానికి పూర్తి అర్హులు. నేను రోహిత్ భాయ్ నుంచి చాలా నేర్చుకున్నాను. అతని ప్రశాంతత, జట్టులో సృష్టించే స్నేహ వాతావరణం నాకు స్ఫూర్తిదాయకం. నేను దానికి కొనసాగిస్తా’ అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉంది. కానీ రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు జట్టుకు కీలకంగా ఉంటారు. ప్రధాన టోర్నమెంట్లలో ముఖ్యంగా ప్రపంచకప్లో వారి అనుభవం కీలకం అవుతుంది. అందుకే 2027 ప్రపంచకప్ వరకు ఇద్డు దిగ్గజాలు ఆడే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..