Chengalpattu Express Robbery: చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!
- చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ
- ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు
- చెన్నై ఎగ్మోర్ ట్రైన్లో దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్ను కత్తిరించారు. దీంతో సిగ్నల్ అందక చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే దుండగులు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. 22159 రైల్లో యస్-1 భోగిలో గుత్తికి చెందిన విశాలాక్షి అనే మహిళ మెడలో నుంచి సుమారు 27 గ్రాముల బంగారు చైన్ను దుండగులు లాక్కెళ్లారు.
Also Read
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
Also Read: AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
మరోవైపు చెన్నై ఎగ్మోర్ ట్రైన్ (17654)లో దొంగలు హల్చల్ చేశారు. క్రాసింగ్ కోసం రామలింగయ్య పల్లి రైల్వే స్టేషన్లో ఎగ్మోర్ ట్రైన్ ఆగగా.. ట్రైన్ కదిలే సమయంలో దివ్యభారతి అనే ప్యాసింజర్ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గోలుసును ఓ దొంగ లాక్కెళ్లాడు. దివ్యభారతి మాత్రమే కాదు మరికొందరిని మెడల్లో నుంచి కూడా బంగారు గోలుసులు లాక్కెళ్లారని తెలుస్తోంది. బాధితులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!