RK Roja: పవన్ కళ్యాణ్పై రోజా సంచలన వ్యాఖ్యలు..
- సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన..
- రూ. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ?
- రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ?
- సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా?
- ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ?
- కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకు పడ్డ ఆర్కే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. “రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే ఒక పెద్ద మోసం.. సి అంటెడ చీటింగ్… బి అంటే బాదుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు.. అధికారికంలోకి రావడమే పెట్రోల్, డిజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచారు… పొదలి లో జగన్ కొచ్చిన జన సునామిని చూసి భయపడి తల్లికి వందనం అమలు చేశారు. అమ్మ ఓడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది… అందుకే మీరు అ పథకం అమలు చేస్తున్నారు.. జగన్ స్కూల్స్ అభివృద్ధి కోసం రెండు వేలు డబ్బు కట్ చేస్తే సైకో అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా సైతాన్ అనాలా? లోకేషా…జోకేషా….అని నవ్వకుంటున్నారు…” అని రోజా వ్యాఖ్యానించారు.
READ MORE: Jagtial: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా.. 9 మందికి విద్యుత్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం..
Also Read
అనంతరం పవన్ కళ్యాణ్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ చస్తే నాకేంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తనకు ఫ్యాకేజీ, పవర్ ఉంటే చాలు అని పవన్ ఉన్నారని.. విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు పడుతున్న పవన్ నిద్రపోతున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానికి హానీమూన్ పిరిడ్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు… అధికారులు, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కూటమీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. రైతుల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వమన్నారు. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడో తెలియడం లేదని.. వరుసగా ఆలయాలు కూలిపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నూ ఎమ్మెల్యే, పోలిసులకు భయం లేదు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వచ్చేలా వైసీపీ పనిచేస్తుందని తెలిపారు. ఏడాది కాలంగా ఏమీ చేయకుండానే సూపర్ సిక్స్ అమలు చేశామని సిగ్గు లేకుండా అబద్దాలు చేబుతున్నారని మండిపడ్డారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నాలిక మడత పెట్టింది చంద్రబాబు అని ఆరోపించారు.
READ MORE: Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..
తాజావార్తలు
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!