Health: ఈ సమస్య వల్ల గుండెపోటు ప్రమాదం.. సకాలంలో చికిత్స తీసుకోకుంటే..?
- హైబీపీ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం
- సకాలంలో చికిత్స తీసుకోకుంటే సమస్యలు
- రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా..
- కిడ్నీ.. కాలేయం.. మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. నియంత్రణ లేకుండా ఉంటే, అది ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎవరికైనా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Bangladesh protests: బంగ్లాదేశ్లో తీవ్ర రూపం దాల్చిన కోటా ఉద్యమం.. షేక్ హసీనా రాజీనామా?
Also Read
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే..?
హై బీపీ సమస్యను తరచుగా తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమయ్యే వరకు దీనిని గుర్తించరు. దాని వల్ల నిరంతర అనియంత్రిత రక్తపోటు.. గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. ఈరోజే మీ బీపీని చెక్ చేసుకోండి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని, అందుకే సకాలంలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపింది.
అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం
హైబీపీ ఉంటే గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా మయోకార్డియం (గుండె కండరం)లో నిర్మాణాత్మక, క్రియాత్మక మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మార్పులలో ఎడమ జఠరిక యొక్క హైపర్ట్రోఫీ గుండె వైఫల్యానికి దారితీసే సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలపై అదనపు ఒత్తిడి ఉంటుంది. అవి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు పరిస్థితి గుండెకు మాత్రమే కాకుండా మెదడుకు కూడా ప్రమాదకరమైనది. హైబీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..
గుండె మాత్రమే కాకుండా అనేక ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. దీని కారణంగా.. కళ్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దాంతో అనేక కంటి సంబంధిత వ్యాధులు, దృష్టి తగ్గడం మరి యు రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తపోటు సమస్య కారణంగా.. మూత్రపిండాలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలలో సమస్యలు ఏర్పడుతుంది. అధిక రక్తపోటు అంగస్తంభన (నపుంసకత్వము) ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
రక్తపోటును ఎలా నియంత్రించాలి..?
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మందులతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సమతుల్య ఆహారం తీసుకోండి.
సోడియం.. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.
ధూమపానం, మద్యం సేవించకూడదు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..