Health: ఈ సమస్య వల్ల గుండెపోటు ప్రమాదం.. సకాలంలో చికిత్స తీసుకోకుంటే..?
- హైబీపీ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం
- సకాలంలో చికిత్స తీసుకోకుంటే సమస్యలు
- రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా..
- కిడ్నీ.. కాలేయం.. మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. నియంత్రణ లేకుండా ఉంటే, అది ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎవరికైనా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Bangladesh protests: బంగ్లాదేశ్లో తీవ్ర రూపం దాల్చిన కోటా ఉద్యమం.. షేక్ హసీనా రాజీనామా?
Also Read
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే..?
హై బీపీ సమస్యను తరచుగా తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమయ్యే వరకు దీనిని గుర్తించరు. దాని వల్ల నిరంతర అనియంత్రిత రక్తపోటు.. గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. ఈరోజే మీ బీపీని చెక్ చేసుకోండి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని, అందుకే సకాలంలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపింది.
అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం
హైబీపీ ఉంటే గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా మయోకార్డియం (గుండె కండరం)లో నిర్మాణాత్మక, క్రియాత్మక మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మార్పులలో ఎడమ జఠరిక యొక్క హైపర్ట్రోఫీ గుండె వైఫల్యానికి దారితీసే సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలపై అదనపు ఒత్తిడి ఉంటుంది. అవి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు పరిస్థితి గుండెకు మాత్రమే కాకుండా మెదడుకు కూడా ప్రమాదకరమైనది. హైబీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..
గుండె మాత్రమే కాకుండా అనేక ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. దీని కారణంగా.. కళ్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దాంతో అనేక కంటి సంబంధిత వ్యాధులు, దృష్టి తగ్గడం మరి యు రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తపోటు సమస్య కారణంగా.. మూత్రపిండాలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలలో సమస్యలు ఏర్పడుతుంది. అధిక రక్తపోటు అంగస్తంభన (నపుంసకత్వము) ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
రక్తపోటును ఎలా నియంత్రించాలి..?
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మందులతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సమతుల్య ఆహారం తీసుకోండి.
సోడియం.. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.
ధూమపానం, మద్యం సేవించకూడదు.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో