Revanth Reddy : కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం కోరుట్లలో కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన కోరుట్ల కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావని, ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆర్ఎస్ చేసిందేం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది.
Also Read : Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్పై అధిష్టానానిదే నిర్ణయం..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆర్ఎస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా? తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన దాంట్లో కేసీఆర్ వాటా ఎంత? 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నడు మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు. విద్యాసాగర్ రావు ఒక లెక్కనా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాం. పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారు. ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది.
Also Read : Holi Incident: హోలీ సంఘటనపై జపాన్ మహిళ స్పందన.. దేశం వదిలివెళ్లిన తర్వాత ట్వీట్స్..
తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!