Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్పై అధిష్టానానిదే నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయాలు జస్ట్ లైక్ క్రికెట్ లాంటిది… ఎప్పుడూ ఒకరే గెలవరు అని వ్యాఖ్యానించారు. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరతారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. కిరణ్ బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. చాలామంది కీలమైన నేతలు త్వరలో బీజేపీలోకి రాబోతున్నారని.. 2024లో ఏపీలో బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Kunamneni Sambasiva Rao : బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని చెబుతోన్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్.. కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వెళ్లాలనే కాంబినేషన్ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సోము వీర్రాజు.. మాది సకల జనుల పార్టీ.. దాని ఆధారంగా రాజకీయాలు బీజేపీలో జరుగుతాయి అన్నారు సోము వీర్రాజు.. కేసీఆర్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్న చెంచాగాళ్లే ధర్నాలు చేస్తున్నారు.. అంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.. అవినీతి వ్యతిరేకంగా మేం ఉంటాం.. ఎవరైనా అవినీతిపరుడు.. సుబ్బారావు కావచ్చు.. సుబ్బలక్ష్మి కావచ్చు.. జ్యోతిలక్ష్మీ కావచ్చు.. అవినీతి చేస్తే ఎవరైనా లోపల వేస్తారని స్పష్టం చేశారు.. ఇక, బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు కేసీఆర్ ముద్దు బిడ్డిలా తీసుకుంటే మేం ఎమీ చేస్తాం..? అని ప్రశ్నించారు.. రూ.20 లక్షల వాచ్ పెట్టుకొనే వారినీ మీరు ప్రేమిస్తారు..? ఏమో సమాజం ప్రేమించదు అని ఎద్దేవా చేశారు.. అవినీతి మీదా దర్యాప్తు సంస్థల టార్గెట్ ఉంటుంది.. దాంట్లో మాకు సంబంధం లేదిన స్పష్టం చేశారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?