Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Government Politics On Water Mlc Kavitha Comments

MLC Kavitha : కేసీఆర్ పాలనలో నీటి ప్రాజెక్టుల పురోగతి

Published Date :January 31, 2025 , 4:58 pm
By Gogikar Sai Krishna
  • కృష్ణా జలాలపై ప్రభుత్వ వైఫల్యం బయటపడింది
  • కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత ఏర్పడింది
  • నీతిగల పాలన అవసరం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha : కేసీఆర్ పాలనలో నీటి ప్రాజెక్టుల పురోగతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLC Kavitha : తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో రాజకీయాలు చేయడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘నీళ్లు – నిజాలు’’ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశారని, మిగిలి ఉన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను అశ్రద్ధచేస్తోందని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో నిజాలు చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో నీటి వనరుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించగలిగారని, కానీ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలోనే కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించగలిగామని వివరించారు. కాలంతో పోటీ పడుతూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించి, ప్రపంచ స్థాయిలోనే అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరంగా మారిందన్నారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేయగలిగిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు.

Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..

‘‘సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్‌లా వ్యవహరిస్తున్నారు. ఆయన కేసీఆర్‌ను శత్రువుగా భావిస్తున్నా, నిజమైన శత్రువు మన జలాలను తరలించే ఆంధ్రా పాలకులని గమనించాలి’’ అని కవిత అన్నారు. ఆంధ్రా కేడర్‌కు చెందిన ఆదిత్యానాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మునుపటి పాలకుల హయాంలో ప్రారంభమైన పథకాలన్నీ కొనసాగిస్తూనే ఉంది. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం బలంగా అమలు చేసింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కేంద్రంలో కొనసాగిస్తోంది. అలాగే కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగించాలి’’ అని కవిత వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి లోనవకుండా నిజాయితీగా పాలన సాగించాలన్న కవిత, ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు తక్షణమే ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం, జలవనరుల అభివృద్ధిని విస్మరించడం దురదృష్టకరమ’’ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, లెక్కలు చెప్పడమే కాదు, ప్రజలకు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మొత్తంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి వనరుల విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదని, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విధానాలు అమలవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

AP DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • Kaleshwaram project
  • Krishna Water Dispute
  • MLC Kavitha

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions