Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Fires On Brs And Bjp

Revanth Reddy : సోనియాగాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినం

Published Date :December 9, 2022 , 1:54 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : సోనియాగాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోనియాగాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినమన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సోనియా గాంధి పుట్టినరోజును పురస్కరించుకొని బోయిన్‌పల్లిలో గల గాంధీఐడియాలజీ సెంటర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల్లో 690 మంది చనిపోయారని, 100 కుటుంబాలకు ఇవాళ రెండు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఢిల్లీ మున్సిపల్, హిమాచల్ ప్రదేశ్.. గుజరాత్‌లో అధికారంలో ఉన్నది బీజేపీనే అని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓడిపోయారు, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయారని, మోడీ నాయకత్వం నీ తిరస్కరించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మోడీని ఓడించి… కాంగ్రెస్ కి పట్టం కట్టిందని, బీజేపీ అనుకూల మీడియా మోడీ ఓటమిని చిన్నదిగా చేసి చూపిస్తున్నారన్నారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది.. దాన్ని నిలబెట్టుకున్నారన్నారు.

Also Read : TSPSC : నిరుద్యోగులకు అలర్ట్‌.. మరో నోటిఫికేషన్‌
మూడు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయంకి వెళ్తే.. రెండిట్లో ఓటమి బీజేపీకే అన్నారు. అంతేకాకుండా.. ‘ఉత్తర ప్రదేశ్ అంటే బీజేపీ అని చేర్పుకున్నారు… యూపీ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించారు. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లో కూడా గులాబీ కూలి విషయంలో కూడా అవినీతి కి పాల్పడ్డారు అని ఫిర్యాదు చేసిన. చందాలు తీసుకోవాలి అంటే 20 వేల కంటే ఎక్కువ తీసుకోవద్దు. అలా తీసుకున్న ec కి నివేదిక ఇవ్వాలి. కానీ అది కూడా చేయలేదు టీఆర్‌ఎస్‌. ఈ వ్యవహారం పై విచారణ జరిపి trs ని రద్దు చేయాలని కోర్టుకి వెళ్లినా. కేంద్ర ఎన్నికల కమిషన్ కు trs పెరు మార్పు వ్యవహారం పై నేను అభ్యన్తరం వ్యక్తం చేసినా. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసిన..ec కి నివేదిక ఇవ్వండి అని రాశారు. ఇవేం పట్టించుకోకుండా … టీఆర్‌ఎస్‌ పేరు ఎలా మార్చుతారు. 6న ఢిల్లీ కోర్టు నుండి నోటీసు ఇచ్చింది. సోమవారం చర్చకు వస్తోంది. ఇంతలోనే ఈసీ పేరు మార్పిడిపై నిర్ణయం ఎలా తీసుకుంది. బీజేపీ నిజంగానే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని అనుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. పేరు మార్పు ప్రక్రియ పై ఈసీ ఎలా అనుమతి ఇచ్చింది. బీజేపీ.. కేసీఆర్ కి ఎలా సహకరిస్తుందో చూడండి.

Also Read

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 
  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

ఇంత మంది వ్యాపారుల మీద ఐటీ దాడులు చేస్తోంది. గులాబీ కూలీపై ఎందుకు ఐటీ చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కోసం ఇప్పటికే ఎంఐఎంని మార్చింది బీజేపీ. ఇప్పుడు ఆప్.. వచ్చింది. మూడో వ్యక్తిగా కేసీఆర్‌ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం బీజేపీ దించబోతుంది. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ వాస్తవం కాదు. నిజమే అయితే.. ఐదేళ్లుగా ఐటీ.. గులాబీ కూలీ మీద ఎందుకు చర్యలు లేవు. టీఆర్‌ఎస్‌ నుండి బీఆర్‌ఎస్‌గా మార్చే కుట్రలో టీఆర్‌ఎస్‌.. బీజేపీ పాత్రధారులే. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr
  • congress

తాజావార్తలు

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?

  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions