Revanth Reddy : తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!
తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచేందుకు అవసరమయ్యే కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్! మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు @blsanthosh హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Also Read : Sabitha Indra Reddy : ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూంలు
Also Read
- Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
ఇదిలా ఉంటే.. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం1 స్థానాల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని బీఆర్ఎస్ ఎంపీలే నాకు చెప్పారని అన్నారు. ఈ పొత్తుల బండారం బయటపడిందనే కాంగ్రెస్పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని అనేక సర్వేలు చెబుతున్నాయని అందువల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ను గెలిపించేందుకే మోడీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోడీని ఆయన దర్బారులో సన్మానం చేశారని శాలువాలు, పూలదండలు మాత్రమే కాదు బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయని అందుకే కేసీఆర్పై మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారని మండిపడ్డారు.
Also Read : ICC World Cup: ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ కు ప్రేక్షకులు డుమ్మా.. వెలవెలపోయిన నరేంద్ర మోడీ స్టేడియం..
తాజావార్తలు
-
Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
-
SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
-
Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
-
Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
-
Sai Sudharsan: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. ఐపీఎల్ హిస్టరీలో నయా రికార్డ్.. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!