Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ 111 జీవో రద్దు చేయడం.. పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపు అప్రజాస్వామిక నిర్ణయమన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జంట నగరాలకు జలాశయం కట్టారు నిజాం అని, అక్కడ పరిశ్రమలు పెడితే ఎన్జీటీ కి వెళ్లారన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వద్దని 1994 లో అప్పటి ప్రభుత్వం నిషేధం పెట్టిందన్నారు. ఎన్జీటీ నుండి సుప్రీంకోర్టు కి కేసు వెళ్ళిందని, 1996లో 111 జీవో వచ్చిందన్నారు. 84 గ్రామాలను బయోకన్జర్వేషన్ లో పెట్టారని, జంట జలాశయాలు పరిరక్షణకి కంకణం కట్టుకున్నారు నాటి పాలకులు అన్నారు రేవంత్ రెడ్డి. ధన దాహం కోసం.. అస్థవ్యస్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘జంట నగరాల్లో విధ్వంసం చేస్తున్నారు. హిరోషిమా..నాగసాకి లపై దాడి కంటే పెద్ద దాడి చేస్తున్నారు కేసీఆర్.
Also Read : Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
పేదల చేతిలో 20 శాతం కూడా లేవు. కేసీఆర్ బినామీలకు.. యువరాజులకు ఎక్కువ భూమి ఉంది. 111 జీవో తొలగింపు ద్వారా…యువరాజు సన్నిహితులను వేళా కోట్లు తెచ్చిపెట్టే ఉద్దేశం ఉంది. కాంగ్రెస్ పోరాటం వల్లనే… కృష్ణ.. గోదావరి జలాలు నగరానికి వచ్చాయి. పైపు లైన్ వేసి జంట నగరాలకు నీళ్లు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ పైప్ లైన్ల టెండర్లు తెర మీదకు తెచ్చారు. పైపుల కంపనీ కోసం కేసీఆర్ కొత్త ప్రతిపాదన. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉంది. కేసీఆర్.. కేటీఆర్ ని క్షమించలేము. దావుద్ ఇబ్రహీం ని అయినా క్షమాపణ అడిగితే ఆలోచించ వచ్చు కానీ. కేసీఆర్.. కేటీఆర్ కి క్షమాపణ పెట్టలేము. కేటీఆర్.. కవిత.. రంజిత్ రెడ్డి.. సంతోష్ లకు భూములు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేత వెనక భారీ భూ కుంభకోణం ఉంది.. విచారణ జరగాలి. కాంగ్రెస్ తరపున నిజ నిర్దారణ కమిటీ. చైర్మన్ గా కోదండ రెడ్డి. అక్కడ ఎవరెవరు భూములు కొన్నారో తేల్చుతం. బీజేపీ నేతలకు సవాల్. బినామీ ఆక్ట్ దీనికి పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది. వేల ఎకరాలు కొని… జీవో ఎత్తివేసి లాభం చేకూర్చుకున్నారు.
దీనిపై విచారణ చేయాలి. బినామీ ఆక్ట్ పై… విచారణ జరగాలి. ప్రొటెక్షన్ మనీ.. బీజేపీకి.. కేసీఆర్ నుండి అందుతోంది. టీఆర్ఎస్.. బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న ముసుగు ఇది. బీఆర్ఎస్ అవినీతిని పట్టించుకోకుండా ఉండేందుకు బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ అందుతుంది. ఈ విధ్వంసంలో సోమేశ్.. అరవింద్ కుమార్ బాధ్యులు’ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!