Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ 111 జీవో రద్దు చేయడం.. పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపు అప్రజాస్వామిక నిర్ణయమన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జంట నగరాలకు జలాశయం కట్టారు నిజాం అని, అక్కడ పరిశ్రమలు పెడితే ఎన్జీటీ కి వెళ్లారన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వద్దని 1994 లో అప్పటి ప్రభుత్వం నిషేధం పెట్టిందన్నారు. ఎన్జీటీ నుండి సుప్రీంకోర్టు కి కేసు వెళ్ళిందని, 1996లో 111 జీవో వచ్చిందన్నారు. 84 గ్రామాలను బయోకన్జర్వేషన్ లో పెట్టారని, జంట జలాశయాలు పరిరక్షణకి కంకణం కట్టుకున్నారు నాటి పాలకులు అన్నారు రేవంత్ రెడ్డి. ధన దాహం కోసం.. అస్థవ్యస్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘జంట నగరాల్లో విధ్వంసం చేస్తున్నారు. హిరోషిమా..నాగసాకి లపై దాడి కంటే పెద్ద దాడి చేస్తున్నారు కేసీఆర్.
Also Read : Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పేదల చేతిలో 20 శాతం కూడా లేవు. కేసీఆర్ బినామీలకు.. యువరాజులకు ఎక్కువ భూమి ఉంది. 111 జీవో తొలగింపు ద్వారా…యువరాజు సన్నిహితులను వేళా కోట్లు తెచ్చిపెట్టే ఉద్దేశం ఉంది. కాంగ్రెస్ పోరాటం వల్లనే… కృష్ణ.. గోదావరి జలాలు నగరానికి వచ్చాయి. పైపు లైన్ వేసి జంట నగరాలకు నీళ్లు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ పైప్ లైన్ల టెండర్లు తెర మీదకు తెచ్చారు. పైపుల కంపనీ కోసం కేసీఆర్ కొత్త ప్రతిపాదన. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉంది. కేసీఆర్.. కేటీఆర్ ని క్షమించలేము. దావుద్ ఇబ్రహీం ని అయినా క్షమాపణ అడిగితే ఆలోచించ వచ్చు కానీ. కేసీఆర్.. కేటీఆర్ కి క్షమాపణ పెట్టలేము. కేటీఆర్.. కవిత.. రంజిత్ రెడ్డి.. సంతోష్ లకు భూములు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేత వెనక భారీ భూ కుంభకోణం ఉంది.. విచారణ జరగాలి. కాంగ్రెస్ తరపున నిజ నిర్దారణ కమిటీ. చైర్మన్ గా కోదండ రెడ్డి. అక్కడ ఎవరెవరు భూములు కొన్నారో తేల్చుతం. బీజేపీ నేతలకు సవాల్. బినామీ ఆక్ట్ దీనికి పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది. వేల ఎకరాలు కొని… జీవో ఎత్తివేసి లాభం చేకూర్చుకున్నారు.
దీనిపై విచారణ చేయాలి. బినామీ ఆక్ట్ పై… విచారణ జరగాలి. ప్రొటెక్షన్ మనీ.. బీజేపీకి.. కేసీఆర్ నుండి అందుతోంది. టీఆర్ఎస్.. బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న ముసుగు ఇది. బీఆర్ఎస్ అవినీతిని పట్టించుకోకుండా ఉండేందుకు బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ అందుతుంది. ఈ విధ్వంసంలో సోమేశ్.. అరవింద్ కుమార్ బాధ్యులు’ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..