Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk Hunger Strike: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర దశలోకి చేరుకుందని, తక్షణ చర్యలు తీసుకోకపోతే అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం, నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సోనమ్ వాంగ్చుక్ 9 కిలోగ్రాములకు పైగా బరువు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన బరువు కేవలం 56.9 కిలోగ్రాములకు పడిపోయింది. డాక్టర్ సతీష్ లంబా తెలిపిన వివరాల ప్రకారం, శరీరానికి ఆహారం అందకపోవడంతో మొదట గ్లూకోజ్, తర్వాత కొవ్వు నిల్వలను వినియోగించిన శరీరం ఇప్పుడు కండరాలను కూడా శక్తి కోసం వినియోగించడం ప్రారంభించింది. దీంతో కండరాలు వేగంగా క్షీణిస్తున్నాయని, యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
వాంగ్చుక్ పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎముకలు స్పష్టంగా కనిపించేంతగా బలహీనపోయారని, స్వయంగా నడవలేని స్థితికి చేరుకున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు, సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ వైద్యుల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆరోగ్యం మరింత విషమిస్తే వెంటనే అవసరమైన వైద్యం అందించాలని స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదని, దానిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు పేర్కొంది. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
అయితే వైద్యుల హెచ్చరికలు, కోర్టు సూచనలు ఉన్నప్పటికీ సోనమ్ వాంగ్చుక్ మాత్రం తన దీక్షను విరమించేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. జూలై 20న పార్లమెంట్ వరకు చేపట్టనున్న పాదయాత్రను మరింత విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ అవగాహనకు ప్రతీకగా చూడాలని విద్యార్థులకు సూచించారు. సోనమ్ వాంగ్చుక్కు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను, వాంగ్చుక్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ, నటి సోనాక్షి సిన్హా, రచయిత్రి శోభా దే, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ థాకరేతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కూడా లేఖ రాసి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం, వైద్యులు, న్యాయస్థానం, ప్రముఖుల విజ్ఞప్తుల మధ్య ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!