Revanth Reddy : భారత్ సత్యగ్రహ సభను విజయవంతం చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల సభకు తరలిరండని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ సత్యగ్రహ సభను విజయవంతం చేయండన్నారు. ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఏఐసీసీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి ఆ కేసులపై రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసి ఒక్క రోజు లోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి ఒక భారీ కుట్రకు తెరలేపారన్నారు. అంతేకాకుండా.. ‘ దేశంలోని జాతీయ సంపదను ప్రజా ఆస్తులను ఆధానికి ధారాదత్తం చేసి అవినీతి కి పాల్పడుతున్న అంశాలపై రాహుల్ గాంధీ నిలదీయడం, ఆధాని అక్రమ సంపాదనలపై, హిండెన్ బర్గ్ నివేదికల ఆధారంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ పై ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల పడుతున్నారు.
Also Read : GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా, సిఎల్పీ భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసీసీ సెక్రెటరీ ఇన్చార్జి తెలంగాణ శ్రీ మాణిక్ రావు ఠాక్రే లతో పాటు సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటారు. ఈ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృతనిశ్చయంతో పనిచేసి, ప్రజలను భాగస్వాములను చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నాయకులు కార్యకర్తలు, జన సమీకరణ చేసి మంచిర్యాల కు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!