Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Gvl Narasimha Rao Sensational Comments On Cm Kcr

GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు

Published Date :April 13, 2023 , 6:15 pm
By NTV WebDesk
GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

GVL Narasimha Rao Sensational Comments On CM KCR: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసిఆర్ మాట్లాడుతున్నారని.. ఇప్పటికీ ఆయన ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమేనని.. కేంద్రమంత్రులకు తాము లేఖలు రాస్తున్నామని, వాటికి వారు రిప్లై కూడా ఇస్తున్నారని తెలియజేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదని.. తానొక్కడినే పార్లమెంట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ లాగా డబ్బా కొట్టుకోవడం కోసం తాము పని చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి

Also Read

  • Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
  • Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!
  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తాము కష్టపడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుందంటే.. దానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్ తమ ఆస్తులు పెంచుకొని, ప్రజలపై అప్పులను నెట్టారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలు సంస్థను నిలబెట్టే విధంగా ఉన్నాయయన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. ఆంధ్రావాసులపై చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. రాజకీయాల అవసరం కోసం ఏపీకి వచ్చి ఉద్దరిస్తానడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి ఎన్నో నిధులు రావాలన్న ఆయన.. ఏపీకి నిధులు ఎందుకివ్వడం లేదని కేసీఆర్‌ని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏమో తెలంగాణకు ధైర్యం నిధులు అడగలేకపోతోందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య లాలూచి ఏంటో వారే చెప్పాలని అడిగారు. 6,400 పైగా పవర్ బకాయిలు ఏపీకి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. విభజన చట్టంలోని న్యాయమైనవి ఏపీకి ఇవ్వడం లేదన్నారు.

Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడం లేదని, కేసీఆర్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే 40 శాతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పెండింగ్ అంశాలను ఎందుకు పరిష్కరించలేదో కేసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. 15 రోజుల్లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎలాగో అడగదు కాబట్టే.. ఆ బకాయిలు చెల్లించాలని తాను అడుగుతున్నానన్నారు. ఆ బకాయిలు చెల్లించాకే ఏపీలో అడుగుపెట్టాలన్నారు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే.. తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణాలోని సెటిలర్స్ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరుకుంటున్నారని.. మీలా దుర్మార్గంగా ‌ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని గుర్తించడం లేదన్నారు. మీరు ఓటేసి గెలిపిస్తే.. కాంగ్రెస్ ఏపీ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap vs telangana
  • cm kcr
  • GVL Narasimha Rao
  • Minister KTR
  • vizag steel plant

తాజావార్తలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

  • RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…

  • Off The Record : కాకినాడలో ‘పేకాట’ జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions