GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Sensational Comments On CM KCR: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసిఆర్ మాట్లాడుతున్నారని.. ఇప్పటికీ ఆయన ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమేనని.. కేంద్రమంత్రులకు తాము లేఖలు రాస్తున్నామని, వాటికి వారు రిప్లై కూడా ఇస్తున్నారని తెలియజేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడలేదని.. తానొక్కడినే పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ లాగా డబ్బా కొట్టుకోవడం కోసం తాము పని చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
Also Read
విశాఖ స్టీల్ ప్లాంట్పై తాము కష్టపడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్లు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుందంటే.. దానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్ తమ ఆస్తులు పెంచుకొని, ప్రజలపై అప్పులను నెట్టారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలు సంస్థను నిలబెట్టే విధంగా ఉన్నాయయన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. ఆంధ్రావాసులపై చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. రాజకీయాల అవసరం కోసం ఏపీకి వచ్చి ఉద్దరిస్తానడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి ఎన్నో నిధులు రావాలన్న ఆయన.. ఏపీకి నిధులు ఎందుకివ్వడం లేదని కేసీఆర్ని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏమో తెలంగాణకు ధైర్యం నిధులు అడగలేకపోతోందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య లాలూచి ఏంటో వారే చెప్పాలని అడిగారు. 6,400 పైగా పవర్ బకాయిలు ఏపీకి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. విభజన చట్టంలోని న్యాయమైనవి ఏపీకి ఇవ్వడం లేదన్నారు.
Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మడం లేదని, కేసీఆర్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీని ప్రైవేట్పరం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే 40 శాతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పెండింగ్ అంశాలను ఎందుకు పరిష్కరించలేదో కేసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. 15 రోజుల్లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎలాగో అడగదు కాబట్టే.. ఆ బకాయిలు చెల్లించాలని తాను అడుగుతున్నానన్నారు. ఆ బకాయిలు చెల్లించాకే ఏపీలో అడుగుపెట్టాలన్నారు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే.. తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణాలోని సెటిలర్స్ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరుకుంటున్నారని.. మీలా దుర్మార్గంగా ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని గుర్తించడం లేదన్నారు. మీరు ఓటేసి గెలిపిస్తే.. కాంగ్రెస్ ఏపీ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!