Retail inflation: 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..?
- 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్లో 5.08 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల.
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. డేటా ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో 9.36 శాతానికి పెరగగా, ఈ ఏడాది మేలో 8.69 శాతానికి పెరిగింది. గతేడాది జూన్లో ఇది 4.35 శాతంగా ఉంది. జూన్ నెలలో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, వాటి ఉత్పత్తులతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు.. పాల ధరలు కూడా పెరిగాయి.
PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్కు అప్పగించింది. CPI ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్తో 4 శాతం వద్ద ఉండేలా చూసుకునే బాధ్యతను ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి అప్పగించింది. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు ఆర్బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేశారు.
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
గనులు, విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా ఈ ఏడాది మేలో దేశ పారిశ్రామికోత్పత్తి 5.9 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ఆధారంగా మే 2023లో 5.7 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం, మే 2024లో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం మరియు విద్యుత్ ఉత్పత్తి 13.7 శాతం పెరిగింది. డేటా ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు ఈ ఏడాది మేలో 4.6 శాతానికి క్షీణించింది.. ఈ ఏడాది ప్రారంభంలో 6.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మే మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.4 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 5.1 శాతంగా ఉంది.

- Tags
- 4-month
- business news
- Food
- high
- June
తాజావార్తలు
-
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
-
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
-
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
-
China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!