Retail inflation: 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..?
- 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్లో 5.08 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. డేటా ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో 9.36 శాతానికి పెరగగా, ఈ ఏడాది మేలో 8.69 శాతానికి పెరిగింది. గతేడాది జూన్లో ఇది 4.35 శాతంగా ఉంది. జూన్ నెలలో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, వాటి ఉత్పత్తులతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు.. పాల ధరలు కూడా పెరిగాయి.
PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్కు అప్పగించింది. CPI ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్తో 4 శాతం వద్ద ఉండేలా చూసుకునే బాధ్యతను ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి అప్పగించింది. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు ఆర్బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేశారు.
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
గనులు, విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా ఈ ఏడాది మేలో దేశ పారిశ్రామికోత్పత్తి 5.9 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ఆధారంగా మే 2023లో 5.7 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం, మే 2024లో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం మరియు విద్యుత్ ఉత్పత్తి 13.7 శాతం పెరిగింది. డేటా ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు ఈ ఏడాది మేలో 4.6 శాతానికి క్షీణించింది.. ఈ ఏడాది ప్రారంభంలో 6.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మే మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.4 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 5.1 శాతంగా ఉంది.

- Tags
- 4-month
- business news
- Food
- high
- June
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!