Retail inflation: 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..?
- 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్లో 5.08 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. డేటా ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో 9.36 శాతానికి పెరగగా, ఈ ఏడాది మేలో 8.69 శాతానికి పెరిగింది. గతేడాది జూన్లో ఇది 4.35 శాతంగా ఉంది. జూన్ నెలలో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, వాటి ఉత్పత్తులతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు.. పాల ధరలు కూడా పెరిగాయి.
PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్కు అప్పగించింది. CPI ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్తో 4 శాతం వద్ద ఉండేలా చూసుకునే బాధ్యతను ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి అప్పగించింది. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు ఆర్బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేశారు.
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
గనులు, విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా ఈ ఏడాది మేలో దేశ పారిశ్రామికోత్పత్తి 5.9 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ఆధారంగా మే 2023లో 5.7 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం, మే 2024లో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం మరియు విద్యుత్ ఉత్పత్తి 13.7 శాతం పెరిగింది. డేటా ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు ఈ ఏడాది మేలో 4.6 శాతానికి క్షీణించింది.. ఈ ఏడాది ప్రారంభంలో 6.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మే మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.4 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 5.1 శాతంగా ఉంది.

- Tags
- 4-month
- business news
- Food
- high
- June
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..