Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
- దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతుంది
- తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు ప్రణాళిక ఉంది
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు. దక్షిణ భారతంలో బీజేపి బలపడుతుందని.. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందన్నారు. తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు మా దగ్గర 15వందల రోజుల ప్రణాళిక ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద దాటలేదన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని.. అయినా వారి నేత అహంకారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని.. ఇండియా కూటమికి నాయకత్వమే లేదన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమాన పరుస్తుందని.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. మోడీ ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లకు ఎటువంటి డోకా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అని.. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. గత పదేళ్లలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కొత్త పాత లేదన్న ఆయన.. బీజేపీలో చేరిన వారందరూ పాత వారేనన్నారు. ఈటల పార్టీకి కొత్త కాదు ఆయన పాత అయిపోయాడని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందన్నారు.
ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని.. అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. టాప్ 5 ఎకనామిక్ సిటీస్లో హైదరాబాద్ ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నేతల పదవుల కోసం కాదని.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమేనన్నారు. నీట్ అంశం సుప్రీం కోర్టులో ఉంది.. త్వరలో తేలుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ అంశంపై మాట్లాడేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారు. లోకల్ బాడి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..