Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
- దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతుంది
- తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు ప్రణాళిక ఉంది
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు. దక్షిణ భారతంలో బీజేపి బలపడుతుందని.. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందన్నారు. తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు మా దగ్గర 15వందల రోజుల ప్రణాళిక ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద దాటలేదన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని.. అయినా వారి నేత అహంకారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని.. ఇండియా కూటమికి నాయకత్వమే లేదన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమాన పరుస్తుందని.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. మోడీ ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లకు ఎటువంటి డోకా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అని.. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. గత పదేళ్లలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కొత్త పాత లేదన్న ఆయన.. బీజేపీలో చేరిన వారందరూ పాత వారేనన్నారు. ఈటల పార్టీకి కొత్త కాదు ఆయన పాత అయిపోయాడని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందన్నారు.
ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని.. అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. టాప్ 5 ఎకనామిక్ సిటీస్లో హైదరాబాద్ ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నేతల పదవుల కోసం కాదని.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమేనన్నారు. నీట్ అంశం సుప్రీం కోర్టులో ఉంది.. త్వరలో తేలుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ అంశంపై మాట్లాడేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారు. లోకల్ బాడి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!