RBI 2000 Rupees Note Exchange: గడువు ముగిసింది. రూ. 2000 నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI 2000 Rupees Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు. ఇప్పుడు దానిని మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువు ముగిసింది. అయితే దీని తర్వాత కూడా మీరు రూ 2000 నోటును మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 7 తర్వాత ఏ బ్యాంకు రూ. 2,000 కరెన్సీని అంగీకరించదు. అయితే, దీని తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. మీ వద్ద కూడా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే గడువు ముగిసిన తర్వాత కూడా మీరు దానిని మార్చుకోవచ్చు. డిపాజిట్ చేయవచ్చు. సెప్టెంబరు 30న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 8 నుండి బ్యాంకులు రూ.2000 నోటును అంగీకరించవు. వారి ఖాతాలలో కూడా డిపాజిట్ చేయవు. ఏ ఇతర నోటుతో మార్పిడి చేయబడదు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also:Health Tips : రోజూ అర్ధరాత్రి వరకు నిద్రపోవడం లేదా? ప్రాణాలు పోతాయి తెలుసా?
దీని కోసం మీరు ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలలో ఒకదాన్ని సందర్శించాలి. మీరు ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా నోటును మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. మీరు పోస్టాఫీసు ద్వారా ఆర్బిఐ కార్యాలయాలకు కూడా రూ.2000 నోటును పంపవచ్చు.
ఎవరికైనా జరిమానా విధిస్తారా?
మీరు ఇంకా రూ. 2,000 మార్చుకోకపోతే.. ఇప్పుడు మీరు ఆర్బీఐ 19 కార్యాలయాలలో దేనికైనా వెళ్లవచ్చు లేదా పోస్టాఫీసు ద్వారా పంపవచ్చు. 2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఆర్బిఐ ఎటువంటి రుసుమును వసూలు చేయదు.
ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలు
ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలలో అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఉన్నాయి.
Read Also:Broccoli Benefits: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఇది తినండి
ఎన్ని నోట్లు డిపాజిట్ చేయవచ్చు
ఆర్బీఐ ఏదైనా సంస్థ లేదా వ్యక్తి రూ. 2000 నోటును రూ. 20,000 వరకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!